కిరణ్ కు ''రాష్ట్రీయ సమాజ్ సేవా రత్న'' పురస్కారం
- November 08, 2020
'మనం సైతం' సేవా సంస్థ ద్వారా పేదలను ఆదుకుంటున్నారు నటులు కాదంబరి కిరణ్. చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్ ల వారితో పాటు సంస్థ సాయం కోరిన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తున్నారు. కాదంబరి చేస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ ఏడాది ''రాష్ట్రీయ సమాజ్ సేవా రత్న'' పురస్కారం దక్కింది. అక్టోబర్ 31న ప్రకటించిన ఈ అవార్డ్ ఆదివారం (నవంబర్ 8న) ఆయనకు చేరింది. ఢిల్లీ ప్రభుత్వ గుర్తింపు పొందిన 'ది గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్' వారు ఈ ''రాష్ట్రీయ సమాజ్ సేవా రత్న'' పురస్కారాన్ని కళలు, సామాజిక సేవ, వైద్య, వ్యాపారం వంటి రంగాల్లో ఏటా అందిస్తుంటారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి కాదంబరి కిరణ్ ను సేవా విభాగంలో ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ...మనం సైతం సేవా సంస్థ ద్వారా వేలాది మందికి సహాయం చేసే అదృష్టం నాకు దక్కింది. ఈ సేవా కార్యక్రమాలకు రాష్ట్రీయ సమాజ్ సేవా రత్న పురస్కారం దక్కడం నిజంగా ప్రోత్సాహకరం. నా సేవకు దొరికిన గుర్తింపుగా భావిస్తున్నాను. వినయంగా అవార్డును స్వీకరిస్తున్నాను. చేతనైన సాయం కోసం ఎప్పుడైనా ఎక్కడైనా, ఎవరికైనా..మనం సైతం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నా. అన్నారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!