మిర్కాబ్ లో మల్టీ స్టోర్ కార్ పార్కింగ్ బిల్డింగ్ ప్రారంభం
- November 08, 2020
కువైట్: కువైట్ లోని అల్-మిర్కాబ్ లో వాహనదారులకు మరో పార్కింగ్ ఏరియా అందుబాటులోకి వచ్చింది. నగరంలో మల్టీ స్టోర్ కార్ పార్కింగ్ బిల్డింగ్ ను ఆర్ధిక మంత్రి బర్రక్ అల్ షీతన్ ఆదివారం ప్రారంభించారు. మినిస్టర్స్ కాంప్లెక్స్ సమీపంలోనే ఈ బిల్డింగ్ ఉంది. అయితే..తొలుత బిల్డింగ్ లోని కొంత భాగాన్ని మాత్రమే పార్కింగ్ కు వినియోగించనున్నట్లు అధికారులు వెల్లడించారు. త్వరలోనే మిగిలిన ప్రాంతాన్ని కూడా పార్కింగ్ కోసం అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఆదివారం నుంచి గురువారం వరకు ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాహనదారులు తమ వాహనాలను పార్క్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్
- హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
- తెలంగాణలో పోటాపోటీగా రాజకీయ సభలు!
- ఉచితానికి పోతే ఖాతా ఖాళీ!
- ప్రజల మనసులు గెలవండి..మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత









