బ్యాటరీ మార్చుతుండగా బోటులో అగ్ని ప్రమాదం
- November 10, 2020రస్ అల్ ఖైమా: ఇద్దరు భారతీయ ఫిషర్మెన్ తీవ్రంగా గాయపడిన ఘటన రస్ అల్ ఖైమాలోని గలెలియా పోర్ట్ వద్ద జరిగింది. ఫిషింగ్ బోటులో అగ్ని ప్రమాదం సంభవించడంతో అందులో వున్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఫిషర్మెన్కి ఓ మోస్తరు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. హాస్పిటల్ డైరెక్టర్ అహ్మద్ అల్ మెహబూబి మాట్లాడుతూ, గాయాలతో ఆసుపత్రిలో చేరినవారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని అన్నారు. రస్ అల్ ఖైమా ఫిషర్మెన్ అసోసియేషన్ హెడ్ ఖలీఫా అల్ ముహైరి మాట్లాడుతూ, బ్యాటరీని మార్చే క్రమంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు బాధితులు చెప్పారని, ఈ మేరకు అసోసియేషన్కి సమాచారం ఇచ్చారని తెలిపారు. రెగ్యులర్ మెయిన్టెనెన్స్తో ఈ తరహా ప్రమాదాల్ని నివారించవచ్చునని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!