49 గంటల యూఏఈ నేషనల్‌ డే సేల్‌ ప్రారంభించిన ఎతిహాద్‌

- November 12, 2020 , by Maagulf
49 గంటల యూఏఈ నేషనల్‌ డే సేల్‌ ప్రారంభించిన ఎతిహాద్‌

:ఎతిహాద్‌ ఎయిర్‌ వేస్‌, 49 గంటల నేషనల్‌ డే సేల్‌ని ప్రారంభించింది. 49 దిర్హాముల డిపాజిట్‌ చేస్తే, ప్రయాణానికి 21 ముందు వరకు ఎలాంటి అదనపు చెల్లింపులు చేయాల్సిన అవసరం వుండదు. సెప్టెంబర్‌ 30, 2021లోపు ప్రయాణీకులు విమానాల్లో ప్రయాణించొచ్చు. అబుదాబీ నుంచి బీరట్‌కి కేవలం 1,249 దిర్హాములతోనూ, ఏథెన్స్‌కి 2,449 దిర్హాములతోనూ, మాల్దీవ్స్‌కి 3,049 దిర్హాములతోనూ ప్రయాణించవచ్చు. రిటర్న్‌ బిజినెస్‌ బేస్‌ ఫేర్‌లు 5,349 దిర్హాములు (దుబాయ్‌ నుంచి కైరో) వుంటుంది. ప్రయాణీకులకు మూడు రాత్రుల ప్యాకేజీ డీల్స్‌ (ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు మరియు అకామడేషన్‌ - నాలుగు లేదా ఐదు స్టార్స్‌ హోటల్స్‌ కోరో, ఏథెన్స్‌ మరియు మాల్దీవ్స్‌లో) వినియోగించుకోవచ్చుర. స్టేకేషన్‌ డీల్స్‌ విషయానికొస్తే ఒకరాత్రి స్టే చేయడం కోసం 149 దిర్హాములకే ప్యాకేజీ అందుబాటులో వుంటుంది. కాంప్లిమెంటరీ డేట్‌ లేదా డెస్టినేషన్‌ ఛేంజెస్‌ కూడా లభ్యమవుతాయి. బుధవారం, నవంబర్‌ 11 ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ సేల్‌, శుక్రవారం (నవంబర్‌ 13) ఉదయం 10 గంటలకు ముగుస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com