ఫ్రీ కూపన్లు అంటూ తప్పుడు ప్రచారం..కూపన్ల ప్రచారాన్ని కొట్టిపారేసిన లులు
- November 12, 2020
యూఏఈ:యూఏఈలోని ప్రముఖ రిటైల్ మార్కెట్... లులు గ్రూప్ ప్రజలకు 250 యూరో డాలర్ల ఉచిత కూపన్లు అందిస్తోన్న ప్రచారాన్ని చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ వి.నందకుమార్ కొట్టిపారేశారు. తాము ఎలాంటి కూపన్ ఆఫర్లు ప్రకటించలేదని ఆయన స్పష్టం చేశారు. సర్వే పేరుతో కొందరు నకిలీగాళ్లు వినియోగదారులను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని..అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపారు. సర్వే పేరుతో వినియోగదారుల అభిప్రయాలను తెలుసుకున్న తర్వాత..నెక్ట్స్ టార్గెట్ గా వాట్సాప్ లో ఐదు గ్రూపులకు గానీ, 20 మంది స్నేహితులకు లులు హైపర్ మార్కెట్ రిఫర్ చేయాలని షరతు విధిస్తారు. మెసేజ్ చేయగానే 250 యూరో డాలర్ల కూపన్ అందుతుందని, దాంతో హైపర్ మార్కెట్ లో షాపింగ్ చేయవచ్చని, ఆన్ లైన్ లో కూడా షాపింగ్ చేసే అప్షన్ ఉందని మోసగాళ్లు ప్రచారం చేస్తున్నారు. అయితే..తాము ఎవరికీ ఎలాంటి కూపన్లను ఆఫర్ చేయటం లేదని లులు ప్రకటించింది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







