టపాసులపై నిషేధాన్ని పట్టించుకోని ప్రజలు, ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం
- November 15, 2020
న్యూఢిల్లీ: దీపావళిని దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సహాల మధ్య జరుపుకున్నారు. అయితే కరోనా నేపథ్యంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో క్రాకర్ల వినియోగంపై ఉన్న నిషేధాన్ని ప్రజలు పట్టించుకోలేదు. దేశంలోని అన్ని ప్రాంతాలతోపాటు ఢిల్లీలో కూడా నిషేధాన్ని ఉల్లంఘించి క్రాకర్లను పెద్ద ఎత్తున కాల్చారు. దీంతో ఢిల్లీతోపాటు, దాని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. శనివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఎక్యూఐ(ఎయిర్ క్వాలిటి ఇండెక్స్) సగటు 468గా ఉంది. అది రాత్రి ఎనిమిది గంటలయ్యే సరికి చాలా ప్రాంతాల్లో ఐదు వందలకు చేరుకుంది. రాత్రికి ఢిల్లీలో అది ఎనిమిది వందల పాయింట్లకు చేరింది. ఢిల్లీలో క్రాకర్ల అమ్మకాలు, వినియోగాన్ని నవంబర్9వ తేదీ నుంచి నవంబర్ 30 వరకు నిషేధిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశిలిచ్చింది. దేశవ్యాప్తంగా కూడా క్రాకర్స్ వినియోగాన్ని నిషేధించింది. కానీ దీపావళి రోజు ఆదేశాలను ఎవరూ పట్టించుకోలేదు. అందరూ క్రాక్రర్స్ను కాల్చడంతో దేశవ్యాప్తంగా కాయు కాలుష్యం పెరిగింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన