డ్రగ్స్ వినియోగానికి 10,000 దిర్హాముల జరీమానా, జైలు శిక్ష
- November 17, 2020
యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్, ఎవరూ డ్రగ్స్ అలాగే సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (మత్తు మందులు, మాదక ద్రవ్యాలు) వినియోగించరాదనీ, యువత ఈ విషయంలో అప్రమత్తంగా వుండాలనీ, ఒకవేళ ఈ కేసుల్లో చిక్కితే రెండేళ్ళకు తక్కువ కాకుండా జైలు శిక్ష, 10,000 దిర్హాములకు పై బడి జరీమానా విధించే అవకాశం వుందని స్పష్టం చేసింది. మత్తు మందులు, మాదక ద్రవ్యాల వినియోగంపై హెచ్చరికలు జారీ చేసేలా ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తున్నారు. సంబంధిత చట్టాల సమాచారాన్ని అందుబాటులో వుంచుతున్నారు. ఏ విధంగానూ డ్రగ్స్ని సేవించడం మంచిది కాదని ఆర్టికల్ 34 చెబుతోంది. డ్రగ్స్ వినియోగం, సరఫరాపై సోషల్ మీడియా ద్వారాగానీ, ఇంకే విధంగా అయినా నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు ఇస్తే, అది కూడా క్రిమినల్ చర్యగానే భావిస్తారు. కేసుల తీవ్రతను బట్టి ఆయా నేరాల్లో మరణ శిక్షలు కూడా వుంటాయి.
తాజా వార్తలు
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం
- తన పేరుతో సేవా సంస్థలు ఏర్పాటు పై కేటీఆర్ స్పందన
- ప్రమాదంలో గ్రామ సచివాలయాలు: పీపుల్స్ పల్స్ అధ్యయనంలో వ్యవస్థాగత వైఫల్యాలు బహిర్గతం
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!









