గ్రాండ్ అబుదాబీ ఫెస్టివల్: సందర్శకుల కోసం ఉచిత బస్ సర్వీసులు
- November 17, 2020
అబుధాబి: షేక్ జాయెద్ హెరిటేజ్ ఫెస్టివల్ కోసం వెళ్ళే సందర్శకులకు ఉచిత పబ్లిక్ బస్లను సమకూర్చుతున్నట్లు ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ వెల్లడించాయి. నవంబర్ 20, శుక్రవారం ఈ ఫెస్టివల్ ప్రారంభమయి, ఫిబ్రవరి 20, 2021 వరకు కొనసాగుతుంది. అల్ వత్బాలో ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ (ఐటిసి) - డిపార్ట్మెంట్ ఆఫ్ మునిసిపాలిటీస్ అండ్ ట్రాన్స్పోర్ట్, అబుదాబీ వెల్లడించిన వివరాల ప్రకారం, సందర్శకుల్ని తరలించేందుకు తగిన వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అబుదాబీ మెయిన్ బస్ స్టాండ్లో ఈ ఉచిత బస్సులు సందర్శకులకు అందుబాటులో వుంటాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతి గంటకూ బస్సు అందుబాటులో వుంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తిరుగు ప్రయాణమయ్యేందుకు బస్సులు అందుబాటులో వుంటాయి. మూడు నెలల పాటు జరిగే ఫెస్టివల్లో 3,500 యాక్టివిటీస్ వుంటాయి.
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









