సౌదీ: వివాదస్పద తీర్పులు ఇచ్చిన ఇద్దరు జడ్జీలపై సస్పెన్షన్ వేటు
- November 17, 2020
సౌదీ అరేబియాలో రెండు వేర్వేరు కేసుల్లో వివాదస్పద తీర్పులు ఇచ్చిన ఇద్దరు జడ్జీలపై సస్పెన్షన్ వేటు పడింది. గడ్డం చేయించుకోవటం, హుక్కా తాగటం నిషేధమంటూ వ్యక్తిగత అభిప్రాయాల మేరకు తీర్పు ఇచ్చినందుకుగాను సౌదీ సుప్రీం జ్యూడిషియల్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. న్యాయవ్యవస్థల్లో వ్యక్తిగత అభిప్రయాలకు తావులేదని మండలి అభిప్రాయపడింది. శాసనపరమైన, చట్టపరమైన ఉల్లంఘనలు జరిగినప్పుడు ఆ మేరకు తీర్పులు ఉండాలని అభిప్రాయపడింది. అంతేగానీ మగవాళ్లు షేవింగ్ చేసుకోవద్దు, హుక్కా తాగవద్దు అంటూ ధర్మాసనం అధిష్టించిన న్యాయమూర్తులు తమ వ్యక్తిగత ఉద్దేశాలను తీర్పుల తీర్పుల రూపంలో జనంపై రుద్దేందుకు వీలు లేదని న్యాయ మండలి స్పష్టం చేసింది. ప్రస్తుతం సస్పెన్షన్ ఎదుర్కుంటున్న ఆ ఇద్దరి జడ్జీల కేసులో విచారణ జరుగుతోందని, అలాగే వారి వెలువరించిన తీర్పులై సమీక్ష నిర్వహిస్తున్నట్లు వివరించింది. విచారణ తర్వాత ఆ ఇద్దరు న్యాయమూర్తులపై జరిమానా వేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









