కువైట్, ఖతార్ మధ్య పలు రంగాలకు సంబంధించి ఒప్పందాలు
- November 18, 2020
కువైట్, ఖతార్ మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం పడేలా ఇరు దేశాలు మరికొన్ని రంగాల్లో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. కువైట్ తరపున విదేశాంగ మంత్రి షేక్ అహ్మద్ నాస్సెర్ అల్ సాబా...ఖతార్ తరపున షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల్ తని పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష పెట్టుబడి, సివిల్ సర్వీస్, పరిపాలన పరమైన అభివృద్ధి, ఇస్లామిక్ అఫైర్స్, వ్యవసాయ రంగాలకు సంబంధించి రెండు దేశాల మంత్రులు ఎంవోయూలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కువైట్ విదేశాంగ మంత్రి షేక్ అహ్మద్ మాట్లాడుతూ..కోవిడ్ మహమ్మారి సమయంలో కువైటీయన్లకు ఖతార్ ప్రభుత్వం, ప్రజలు అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఖతార్ లో చిక్కుకుపోయిన వారిని ఆదరించి, తిరిగి స్వదేశం చేరుకునే వరకు కువైటీయన్లపై ఖతార్ ప్రభుత్వం చూపిన ఆదరణను మరువలేమని ప్రశంసించారు.
తాజా వార్తలు
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని







