కువైట్, ఖతార్ మధ్య పలు రంగాలకు సంబంధించి ఒప్పందాలు
- November 18, 2020
కువైట్, ఖతార్ మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం పడేలా ఇరు దేశాలు మరికొన్ని రంగాల్లో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. కువైట్ తరపున విదేశాంగ మంత్రి షేక్ అహ్మద్ నాస్సెర్ అల్ సాబా...ఖతార్ తరపున షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల్ తని పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష పెట్టుబడి, సివిల్ సర్వీస్, పరిపాలన పరమైన అభివృద్ధి, ఇస్లామిక్ అఫైర్స్, వ్యవసాయ రంగాలకు సంబంధించి రెండు దేశాల మంత్రులు ఎంవోయూలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కువైట్ విదేశాంగ మంత్రి షేక్ అహ్మద్ మాట్లాడుతూ..కోవిడ్ మహమ్మారి సమయంలో కువైటీయన్లకు ఖతార్ ప్రభుత్వం, ప్రజలు అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఖతార్ లో చిక్కుకుపోయిన వారిని ఆదరించి, తిరిగి స్వదేశం చేరుకునే వరకు కువైటీయన్లపై ఖతార్ ప్రభుత్వం చూపిన ఆదరణను మరువలేమని ప్రశంసించారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?









