బీహార్ రగిల్చిన చిచ్చు..కాంగ్రెస్ లో అనిశ్చితి..
- November 19, 2020
న్యూఢిల్లీ: కాంగ్రెస్ లో బిహార్ చిచ్చు చివరికి రాజీనామాల వైపు వ్యవహారం మళ్లింది. అయితే బిహార్ ఓటమిపై సమగ్రంగా విశ్లేషణ జరగాల్సిందేనని అన్ని పక్షాలూ పట్టుబడుతున్నాయి. బిహార్ ఘోర పరాభవానికి నైతికంగా బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి శక్తిసింగ్ గోలీ ఇప్పటికే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తన రాజీనామా లేఖను హైకమాండ్కు పంపినట్లు సమాచారం. ఈయనతో పాటు బిహార్ పీసీసీ అధ్యక్షుడు మదన్ మోహన్ ఝా కూడా రాజీనామా చేసినట్లు సమాచారం.
అయితే అధిష్ఠానం తీసుకునే తుది నిర్ణయానికి ఆయన వేచి చూస్తున్నట్లు ఆయన వర్గం అంటోంది. ఝా మాత్రం రాజీనామా విషయంలో ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయడం లేదు. రాజీనామా విషయంపై ఝాను వివరణ కోరగా... ''ఆ విషయంపై నేను బహిరంగంగా స్పందించను. పార్టీ ఫోరంలోనే మాట్లాడతా. పార్టీ నేతలందరం కలిసి కూర్చుంటాం. ఓటమిని సమీక్షించుకుంటాం. హైకమాండ్ ఏది చెపితే దాన్ని శిరసావహిస్తాం.'' అని ఝా ప్రకటించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ నుండి ఫేస్బుక్ మెసెంజర్ క్లోజ్..!!
- గాజా శాంతి, పునర్నిర్మాణ ప్రయత్నాలకు మద్దతు ..!!
- హోం బేస్డ్ గ్రోసరీ స్టోర్లు మూసివేత..!!
- రద్దీ నివారణకు ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..!!
- మదీనాలో వార్షిక పర్యాటక వ్యయం 22% వృద్ధి..!!
- ఈద్ సెలవులు 3 లేదా 4 రోజులు ఉంటాయా?
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక









