స్వదేశీ కార్మికుల కనీస వేతనాలను సవరించిన సౌదీ ప్రభుత్వం
- November 20, 2020
రియాద్:సౌదీ పౌరుల జీవన ప్రమాణాలను పెంపొందే దిశగా సౌదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రంగాల్లో పని చేస్తున్న స్వదేశీ కార్మికుల కనీస వేతనాన్ని 4000 రియాల్స్ కు పెంచుతూ సవరణలు చేసింది. నితాఖాత్ ప్రొగ్రామ్ లో భాగంగా సౌదీయుల్లో నిరుద్యోగ శాతాన్ని తగ్గించేందుకు ఈ సవరణలు దోహదం చేస్తాయని మానవ వనరులు, సాంఘికాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో సౌదీ సంస్థల్లో స్వదేశీయులకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగు అవుతాయని అభిప్రాయపడింది. అయితే..ఈ పెంచిన కనీస వేతనాలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయో మాత్రం మంత్రిత్వ శాఖ స్పష్టత ఇవ్వలేదు. ఇదిలాఉంటే..పెంచిన వ్యాట్ పై కోవిడ్ సంక్షోభం ముగిసిన తర్వాత సమీక్షిస్తామని వాణిజ్య, పెట్టుబడుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 5 శాతంగా ఉన్న వ్యాట్ ను గత జులైలో 15 శాతానికి పెంచిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- T20 World Cup 2026: భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే..
- ముంబై క్లైమేట్ వీక్ 2026లో తెలంగాణ సస్టైనబుల్ విజన్ను ప్రదర్శించిన సీఎం రేవంత్
- తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు
- అమృత్ భారత్ 3.0 రైళ్లు త్వరలో ప్రారంభం
- చిలీతో భారత్ చేస్తున్న ఈ ‘ట్రేడ్ డీల్’ వెనుక ఉన్న వ్యూహం ఏమిటి?
- కువైట్లో ఫిబ్రవరి 25-26 తేదీలలో హాలీడే..!!
- నాసర్ బిన్ ఖలీద్ ఇంటర్ సెక్షన్ 5 గంటలపాటు మూసివేత..!!
- సౌదీ అరేబియా నేటి నుంచే రమదాన్ ప్రారంభం..!!
- నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!
- ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సౌదీ అరేబియా..!!









