కువైట్:విదేశాల్లో చిక్కుకుపోయిన టీచర్లకు నో శాలరీస్..!

- November 20, 2020 , by Maagulf
కువైట్:విదేశాల్లో చిక్కుకుపోయిన టీచర్లకు నో శాలరీస్..!

కువైట్ సిటీ:కోవిడ్ తర్వాత ప్రయాణ సంబంధిత ఆంక్షలతో విదేశాల్లో చిక్కుకుపోయిన టీచర్లకు జీతాలు ఇవ్వలేమని తేల్చి చెప్పింది కువైట్ ప్రభుత్వం. ఏ కారణం చేతనైనా డ్యూటీలో జాయిన్ కాని వారికి ఎలాంటి చెల్లింపులు ఉండవని స్పష్టం చేసింది. అయితే..కువైట్ చేరుకొని కొలువులో చేరిన వారికి మాత్రం...డ్యూటీలో చేరిన తేది నుంచి శాలరీలు అందుతాయని విద్యా శాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే...ప్రయాణ అసౌకర్యాల వల్ల చాలా మంది టీచర్లు కువైట్ చేరుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో టీచర్లు సకాలంలో డ్యూటీలో చేరలేకపోవటాన్ని తాము రిమార్క్ గా భావించటం లేదని అన్నారు. పరిస్థితుల ప్రభావాన్ని తాము అర్ధం చేసుగోగలమని..అందకే వార్షిక మూల్యాంకనంలో ప్రస్తుత గైర్హాజరిని పరిగణలోకి తీసుకోబోమని, అయితే..అబ్సెంట్ అయిన రోజులకు మాత్రం జీతాలు చెల్లించబడవని స్పష్టం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com