కువైట్:విదేశాల్లో చిక్కుకుపోయిన టీచర్లకు నో శాలరీస్..!
- November 20, 2020
కువైట్ సిటీ:కోవిడ్ తర్వాత ప్రయాణ సంబంధిత ఆంక్షలతో విదేశాల్లో చిక్కుకుపోయిన టీచర్లకు జీతాలు ఇవ్వలేమని తేల్చి చెప్పింది కువైట్ ప్రభుత్వం. ఏ కారణం చేతనైనా డ్యూటీలో జాయిన్ కాని వారికి ఎలాంటి చెల్లింపులు ఉండవని స్పష్టం చేసింది. అయితే..కువైట్ చేరుకొని కొలువులో చేరిన వారికి మాత్రం...డ్యూటీలో చేరిన తేది నుంచి శాలరీలు అందుతాయని విద్యా శాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే...ప్రయాణ అసౌకర్యాల వల్ల చాలా మంది టీచర్లు కువైట్ చేరుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో టీచర్లు సకాలంలో డ్యూటీలో చేరలేకపోవటాన్ని తాము రిమార్క్ గా భావించటం లేదని అన్నారు. పరిస్థితుల ప్రభావాన్ని తాము అర్ధం చేసుగోగలమని..అందకే వార్షిక మూల్యాంకనంలో ప్రస్తుత గైర్హాజరిని పరిగణలోకి తీసుకోబోమని, అయితే..అబ్సెంట్ అయిన రోజులకు మాత్రం జీతాలు చెల్లించబడవని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- T20 World Cup 2026: భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే..
- ముంబై క్లైమేట్ వీక్ 2026లో తెలంగాణ సస్టైనబుల్ విజన్ను ప్రదర్శించిన సీఎం రేవంత్
- తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు
- అమృత్ భారత్ 3.0 రైళ్లు త్వరలో ప్రారంభం
- చిలీతో భారత్ చేస్తున్న ఈ ‘ట్రేడ్ డీల్’ వెనుక ఉన్న వ్యూహం ఏమిటి?
- కువైట్లో ఫిబ్రవరి 25-26 తేదీలలో హాలీడే..!!
- నాసర్ బిన్ ఖలీద్ ఇంటర్ సెక్షన్ 5 గంటలపాటు మూసివేత..!!
- సౌదీ అరేబియా నేటి నుంచే రమదాన్ ప్రారంభం..!!
- నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!
- ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సౌదీ అరేబియా..!!









