ప్రవాసీయులపై ఒమనైజేషన్ ఎఫెక్ట్..తగ్గుతున్న మేనేజర్ల సంఖ్య

- November 22, 2020 , by Maagulf
ప్రవాసీయులపై ఒమనైజేషన్ ఎఫెక్ట్..తగ్గుతున్న మేనేజర్ల సంఖ్య

మస్కట్:ఒమనైషన్ దెబ్బతో ఒమన్ లోని ప్రవాసీయుల ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. కొత్త ఉద్యోగాల భర్తీలో కూడా ప్రవాసీయుల సంఖ్య తగ్గతూ వస్తోంది. ఈ విషయాన్ని ఒమన్ జాతీయ గణాంకాలు, సమాచార శాఖ (NCSI) స్వయంగా ప్రకటించింది. ఈ ఏడాది గత సెప్టెంబర్ నాటికి 29 వేల మంది ప్రవాసీయులకు పలు రంగాల్లో ఉపాధి దొరికినట్లు నవంబర్ కు సంబంధించి స్టాటిస్టికల్ బులెటిన్ లో ఎన్సీఎస్ఐ వెల్లడించింది. అయితే..ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఒమన్ లో 14,35,070 మంది ప్రవాసీ కార్మికులు, ఉద్యోగులు ఉన్నారని స్పష్టం చేసింది. అయితే..గత ఏడాది గణాంకాలతో పోలిస్తే ప్రస్తుత ప్రవాసీ ఉద్యోగుల సంఖ్య 17 శాతం తగ్గిందని, 2019లో ఇదే సమయానికి ఒమన్ లో 17,12,798 మంది ప్రవాసీ కార్మికులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలిపింది. కార్మికుల సంఖ్యతో పాటు వివిధ రంగాల్లో మేనేజర్ స్థాయి ఉద్యోగాల్లోనూ ప్రవాసీయుల సంఖ్య 22.4 శాతం తగ్గినట్లు ఎన్సీఎస్ఐ లెక్కగట్టింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దేశంలో 29,687 మంది ప్రవాసీయులు మేనేజర్ స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నారని..గతేడాది ఇదే సమయానికి 37,603 మంది ఉన్నట్లు ఎన్సీఎస్ఐ వెల్లడించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com