బహ్రెయిన్:ఆర్ధిక మోసాలకు పాల్పడబోయిన ముగ్గురు వ్యక్తుల అరెస్ట్

- November 27, 2020 , by Maagulf
బహ్రెయిన్:ఆర్ధిక మోసాలకు పాల్పడబోయిన ముగ్గురు వ్యక్తుల అరెస్ట్

మనామా:బహ్రెయిన్ లో కొందరు విదేశీయులను మోసం చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు షాపింగ్ చేసే సమయంలో వారి నుంచి క్రెడిట్ కార్డు వివరాలను తెల్సుకొని మోసాలకు పాల్పడేందుకు నిందితులు ప్రయత్నించినట్లు యాంటీ కరెప్షన్, సెక్యూరిటీ ఎలక్ట్రానిక్స్ విభాగం డీజీ వివరించారు. షాపులో కొనుగోలు చేసేందుకు వచ్చిన వారి నుంచి క్రెడిట్ వివరాలను సేకరించి..వినియోగదారులకు తెలియకుండా కార్డులను వినియోగించుకోవాలనుకోటం నేరమని డీజీ హెచ్చరించారు. పట్టుబడిన నిందితులను న్యాయవిచారణకు తరలించినట్లు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com