రీ-ఎంట్రీని సులభతరం చేసిన ఖతార్
- November 27, 2020
దోహా:ఆటోమేటిక్ ఎక్సెప్షనల్ ఎంట్రీ పర్మిట్ సర్వీస్ని ఖతార్ నుంచి వెళ్ళేవారికి, వచ్చేవారి కోసం అందుబాటులోకి తెచ్చింది ఖతార ప్రభుత్వం. ఈ మేరకు గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఖతార్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళి వచ్చేవారు డిపాచ్యుర్ సందర్భంగా ఆటోమేటిక్గా ఎక్సెప్షనల్ ఎంట్రీ పర్మిట్ని పొందుతారు. రెసిడెంట్ లేదా వారి ఎంప్లాయర్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెబ్సైట్ నుంచి ఎక్సెప్షనల్ ఎంట్రీ పర్మిట్ని ప్రింట్ తీసుకోవచ్చు. ఖతార్ పోర్టల్ వెబ్సైట్ ద్వారా ప్రత్యేక అనుమతి పొందాల్సిన అవసరం వుండదు. ఖతార్ వెలుపల ప్రస్తుతం వున్నవారికి ఈ సర్వీసు వర్తించదు. వారు ఖతార్ పోర్టల్ ద్వారా పర్మిట్ పొందాల్సి వుంటుంది. కాగా, దేశంలోకి వచ్చాక వారం రోజుల క్వారంటైన్ పీరియడ్ తప్పనిసరిగా కొనసాగుతుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఓల్డ్ గల్ఫ్ ప్లేట్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజు యథాతథం..!!
- యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- కువైట్ లో సైరన్ల టెస్ట్ రన్ టైమ్ లో మార్పులు..!!
- ఖతార్లో ఏడు రెస్టారెంట్లతో సహా 12 ఆహార సంస్థలు మూసివేత..!!
- భారత్-అరబ్ బంధం బలోపేతం..!!
- మస్కట్ నైట్స్: ముగిసి అర్ధా ఒంటెల రేసు..!!
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..
- భారత్ ఘన విజయం
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?







