అవినీతిపై పోరు: 200 మందికి పైగా అరెస్ట్‌

- November 27, 2020 , by Maagulf
అవినీతిపై పోరు: 200 మందికి పైగా అరెస్ట్‌

రియాద్:అవినీతి కేసుల్లో 226 మందిని అరెస్ట్‌ చేసినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. మొత్తం 158 కేసులకు సంబంధించి ఈ అరెస్టులు జరిగాయి. యాంటీ కరప్షన్‌ అథారిటీ (నజాబా), ఆయా వ్యక్తులపై అవినీతి అభియోగాలు మోపింది. వీటిల్లో ఓ కేసు ఆగస్ట్‌లో రిజిస్టర్‌ కాగా, డిఫెన్స్‌ మినిస్ట్రీకి సంబంధించిన అధికారులు అలాగే సివిలియన్స్‌ మధ్య ఓ అవినీతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు నిందితులకు సంబంధించి కేసు వివరాలు వెల్లడయ్యాయి. 1.229 బిలియన్‌ రియాల్స్‌ లంచం ఈ కేసులో జరిగిందని అధికారులు తెలిపారు. విచారణ సందర్భంగా 19 మంది డిఫెన్స్‌ మినిస్ట్రీ ఉద్యోగులు, ముగ్గురు సివిల్‌ సర్వెంట్లు, 18 మంది వ్యాపారవేత్తలు, వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న 8 మందిని నిందితులుగా తేల్చారు. మరో కేసులో రిటైర్డ్‌ నేషనల్‌ గార్డ్‌ ఆఫీసర్‌ నిందితుడిగా వున్నారు. 8.2 మిలియన్‌ సౌదీ రియాల్స్‌ లంచం తీసుకున్నట్లు నిందితుడిపై ఆరోపణలున్నాయి.  

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com