అవినీతిపై పోరు: 200 మందికి పైగా అరెస్ట్
- November 27, 2020
రియాద్:అవినీతి కేసుల్లో 226 మందిని అరెస్ట్ చేసినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. మొత్తం 158 కేసులకు సంబంధించి ఈ అరెస్టులు జరిగాయి. యాంటీ కరప్షన్ అథారిటీ (నజాబా), ఆయా వ్యక్తులపై అవినీతి అభియోగాలు మోపింది. వీటిల్లో ఓ కేసు ఆగస్ట్లో రిజిస్టర్ కాగా, డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన అధికారులు అలాగే సివిలియన్స్ మధ్య ఓ అవినీతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు నిందితులకు సంబంధించి కేసు వివరాలు వెల్లడయ్యాయి. 1.229 బిలియన్ రియాల్స్ లంచం ఈ కేసులో జరిగిందని అధికారులు తెలిపారు. విచారణ సందర్భంగా 19 మంది డిఫెన్స్ మినిస్ట్రీ ఉద్యోగులు, ముగ్గురు సివిల్ సర్వెంట్లు, 18 మంది వ్యాపారవేత్తలు, వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న 8 మందిని నిందితులుగా తేల్చారు. మరో కేసులో రిటైర్డ్ నేషనల్ గార్డ్ ఆఫీసర్ నిందితుడిగా వున్నారు. 8.2 మిలియన్ సౌదీ రియాల్స్ లంచం తీసుకున్నట్లు నిందితుడిపై ఆరోపణలున్నాయి.
తాజా వార్తలు
- ఓల్డ్ గల్ఫ్ ప్లేట్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజు యథాతథం..!!
- యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- కువైట్ లో సైరన్ల టెస్ట్ రన్ టైమ్ లో మార్పులు..!!
- ఖతార్లో ఏడు రెస్టారెంట్లతో సహా 12 ఆహార సంస్థలు మూసివేత..!!
- భారత్-అరబ్ బంధం బలోపేతం..!!
- మస్కట్ నైట్స్: ముగిసి అర్ధా ఒంటెల రేసు..!!
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..
- భారత్ ఘన విజయం
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?







