అవినీతిపై పోరు: 200 మందికి పైగా అరెస్ట్
- November 27, 2020
రియాద్:అవినీతి కేసుల్లో 226 మందిని అరెస్ట్ చేసినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. మొత్తం 158 కేసులకు సంబంధించి ఈ అరెస్టులు జరిగాయి. యాంటీ కరప్షన్ అథారిటీ (నజాబా), ఆయా వ్యక్తులపై అవినీతి అభియోగాలు మోపింది. వీటిల్లో ఓ కేసు ఆగస్ట్లో రిజిస్టర్ కాగా, డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన అధికారులు అలాగే సివిలియన్స్ మధ్య ఓ అవినీతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు నిందితులకు సంబంధించి కేసు వివరాలు వెల్లడయ్యాయి. 1.229 బిలియన్ రియాల్స్ లంచం ఈ కేసులో జరిగిందని అధికారులు తెలిపారు. విచారణ సందర్భంగా 19 మంది డిఫెన్స్ మినిస్ట్రీ ఉద్యోగులు, ముగ్గురు సివిల్ సర్వెంట్లు, 18 మంది వ్యాపారవేత్తలు, వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న 8 మందిని నిందితులుగా తేల్చారు. మరో కేసులో రిటైర్డ్ నేషనల్ గార్డ్ ఆఫీసర్ నిందితుడిగా వున్నారు. 8.2 మిలియన్ సౌదీ రియాల్స్ లంచం తీసుకున్నట్లు నిందితుడిపై ఆరోపణలున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







