అవినీతిపై పోరు: 200 మందికి పైగా అరెస్ట్
- November 27, 2020
రియాద్:అవినీతి కేసుల్లో 226 మందిని అరెస్ట్ చేసినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. మొత్తం 158 కేసులకు సంబంధించి ఈ అరెస్టులు జరిగాయి. యాంటీ కరప్షన్ అథారిటీ (నజాబా), ఆయా వ్యక్తులపై అవినీతి అభియోగాలు మోపింది. వీటిల్లో ఓ కేసు ఆగస్ట్లో రిజిస్టర్ కాగా, డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన అధికారులు అలాగే సివిలియన్స్ మధ్య ఓ అవినీతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు నిందితులకు సంబంధించి కేసు వివరాలు వెల్లడయ్యాయి. 1.229 బిలియన్ రియాల్స్ లంచం ఈ కేసులో జరిగిందని అధికారులు తెలిపారు. విచారణ సందర్భంగా 19 మంది డిఫెన్స్ మినిస్ట్రీ ఉద్యోగులు, ముగ్గురు సివిల్ సర్వెంట్లు, 18 మంది వ్యాపారవేత్తలు, వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న 8 మందిని నిందితులుగా తేల్చారు. మరో కేసులో రిటైర్డ్ నేషనల్ గార్డ్ ఆఫీసర్ నిందితుడిగా వున్నారు. 8.2 మిలియన్ సౌదీ రియాల్స్ లంచం తీసుకున్నట్లు నిందితుడిపై ఆరోపణలున్నాయి.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







