అబుధాబి:10 సెకెండ్లలో 144 ఫ్లోర్స్ భవనం కూల్చివేత
- November 27, 2020
అబుధాబి:అబుధాబిలోని మినా జాయెద్ ప్రాంతంలోగల మినా ప్లాజాని విజయవంతంగా కుప్పకూల్చేశారు. కేవలం 10 సెకెండ్లలో భవనం నేలమట్టమయ్యింది. అబుధాబి మీడియా ఆఫీస్ ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. మినా జాయెద్ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ కూల్చివేత చేపట్టారు. కూల్చివేత సందర్భంగా వచ్చే దుమ్ము, వ్యర్థాల్ని కంట్రోల్ చేయడానికి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశామనీ, అన్నీ అనుకున్నట్లుగానే జరిగాయని అధికారులు పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, పేలుడు పదార్థాల సాయంతో ఈ భవనాన్ని కూల్చివేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ మునిసిపాలిటీస్ అండ్ ట్రాన్స్పోర్ట్, మోడోన్ని ఈ కూల్చివేతల కోసం వినియోగించడం జరిగింది. అబుదాబీ సివిల్ డిఫెన్స్ అథారిటీ, నేషనల్ అంబులెన్స్ అలాగే ఎమర్జన్సీ క్రైసిస్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ సంయుక్త కార్యాచరణతో ఈ కూల్చివేత చోటు చేసుకుంది. మినా జాయెద్ సెకెండ్ ఫేజ్ అభివృద్ధి కోసం ఈ భవనాన్ని తొలగించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









