ఒమన్ - ఇండియా మధ్య పెరిగిన విమాన టిక్కెట్ ధరలు
- November 28, 2020
మస్కట్:విమాన ప్రయాణాలు మరింత భారంగా మారాయి. ప్రైవేటు ఎయిర్లైన్స్పై ఎయిర్ బబుల్ ఒప్పందానికి సంబంధించి నిషేధం డిసెంబర్ 27 వరకు పొడిగించిన నేపథ్యంలో ఇండియాకి వెళ్ళాలనుకునే ప్రయాణీకులకు టిక్కెట్ ధరలు భారంగా మారాయి. అక్టోబర్లో 50 ఒమన్ రియాల్స్ వున్న టిక్కెట్ ధర ఇప్పుడు 135 ఒమన్ రియాల్స్ వరకు పెరిగింది. మస్కట్ - కాలికట్ మధ్య ఈ ధరలున్నాయి. కాగా, మస్కట్ - ముంబై మధ్య టిక్కెట్ ధర 171 ఒమన్ రియాల్స్కి చేరుకుంది. గతంలో ఈ ధర 80 ఒమన్ రియాల్స్గా వుండేది. కరోనా నేపథ్యంలో ఎయిర్ బబుల్ ఒప్పందాలకు సంబంధించి ప్రైవేటు విమానయాన సంస్థలపై నిషేధం విధించారు. తద్వారా ఈ పరిస్థితులు తలెత్తాయి.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







