ఒమన్ - ఇండియా మధ్య పెరిగిన విమాన టిక్కెట్ ధరలు
- November 28, 2020
మస్కట్:విమాన ప్రయాణాలు మరింత భారంగా మారాయి. ప్రైవేటు ఎయిర్లైన్స్పై ఎయిర్ బబుల్ ఒప్పందానికి సంబంధించి నిషేధం డిసెంబర్ 27 వరకు పొడిగించిన నేపథ్యంలో ఇండియాకి వెళ్ళాలనుకునే ప్రయాణీకులకు టిక్కెట్ ధరలు భారంగా మారాయి. అక్టోబర్లో 50 ఒమన్ రియాల్స్ వున్న టిక్కెట్ ధర ఇప్పుడు 135 ఒమన్ రియాల్స్ వరకు పెరిగింది. మస్కట్ - కాలికట్ మధ్య ఈ ధరలున్నాయి. కాగా, మస్కట్ - ముంబై మధ్య టిక్కెట్ ధర 171 ఒమన్ రియాల్స్కి చేరుకుంది. గతంలో ఈ ధర 80 ఒమన్ రియాల్స్గా వుండేది. కరోనా నేపథ్యంలో ఎయిర్ బబుల్ ఒప్పందాలకు సంబంధించి ప్రైవేటు విమానయాన సంస్థలపై నిషేధం విధించారు. తద్వారా ఈ పరిస్థితులు తలెత్తాయి.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







