ఒమన్‌ - ఇండియా మధ్య పెరిగిన విమాన టిక్కెట్‌ ధరలు

- November 28, 2020 , by Maagulf
ఒమన్‌ - ఇండియా మధ్య పెరిగిన విమాన టిక్కెట్‌ ధరలు

మస్కట్:విమాన ప్రయాణాలు మరింత భారంగా మారాయి. ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌పై ఎయిర్‌ బబుల్‌ ఒప్పందానికి సంబంధించి నిషేధం డిసెంబర్‌ 27 వరకు పొడిగించిన నేపథ్యంలో ఇండియాకి వెళ్ళాలనుకునే ప్రయాణీకులకు టిక్కెట్‌ ధరలు భారంగా మారాయి. అక్టోబర్‌లో 50 ఒమన్‌ రియాల్స్‌ వున్న టిక్కెట్‌ ధర ఇప్పుడు 135 ఒమన్‌ రియాల్స్‌ వరకు పెరిగింది. మస్కట్‌ - కాలికట్‌ మధ్య ఈ ధరలున్నాయి. కాగా, మస్కట్‌ - ముంబై మధ్య టిక్కెట్‌ ధర 171 ఒమన్‌ రియాల్స్‌కి చేరుకుంది. గతంలో ఈ ధర 80 ఒమన్‌ రియాల్స్‌గా వుండేది. కరోనా నేపథ్యంలో ఎయిర్‌ బబుల్‌ ఒప్పందాలకు సంబంధించి ప్రైవేటు విమానయాన సంస్థలపై నిషేధం విధించారు. తద్వారా ఈ పరిస్థితులు తలెత్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com