ఒమన్ - ఇండియా మధ్య పెరిగిన విమాన టిక్కెట్ ధరలు
- November 28, 2020
మస్కట్:విమాన ప్రయాణాలు మరింత భారంగా మారాయి. ప్రైవేటు ఎయిర్లైన్స్పై ఎయిర్ బబుల్ ఒప్పందానికి సంబంధించి నిషేధం డిసెంబర్ 27 వరకు పొడిగించిన నేపథ్యంలో ఇండియాకి వెళ్ళాలనుకునే ప్రయాణీకులకు టిక్కెట్ ధరలు భారంగా మారాయి. అక్టోబర్లో 50 ఒమన్ రియాల్స్ వున్న టిక్కెట్ ధర ఇప్పుడు 135 ఒమన్ రియాల్స్ వరకు పెరిగింది. మస్కట్ - కాలికట్ మధ్య ఈ ధరలున్నాయి. కాగా, మస్కట్ - ముంబై మధ్య టిక్కెట్ ధర 171 ఒమన్ రియాల్స్కి చేరుకుంది. గతంలో ఈ ధర 80 ఒమన్ రియాల్స్గా వుండేది. కరోనా నేపథ్యంలో ఎయిర్ బబుల్ ఒప్పందాలకు సంబంధించి ప్రైవేటు విమానయాన సంస్థలపై నిషేధం విధించారు. తద్వారా ఈ పరిస్థితులు తలెత్తాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు