మూడో త్రైమాసికంలో ఎంసీఐఐపీ దగ్గర 4700 వాణిజ్య రిజిస్ట్రేషన్లు నమోదు
- November 28, 2020
ఒమన్: ఒమన్ లో రెండో త్రైమాసికంతో పోలిస్తే...మూడో త్రైమాసికంలో వాణిజ్య రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గుదల కనిపిస్తోంది. మూడో త్రైమాసికంలో ఇప్పటివరకు 4,700 వాణిజ్య రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు వాణిజ్య, పరిశ్రమలు, పెట్టుబడుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంత్రిత్వ శాఖ తెలిపిన గణాంకాల ప్రకారం...రెడ్ కమర్షియల్ రిజిస్ట్రేషన్లు అన్ని కలుపుకొని 2606 సింగిల్ ట్రేడర్ కేటగిరి, 595 పరిమితికి లోబడిన కంపెనీలు, ఒకే వ్యక్తి ఆధీనంలో ఉన్న 498 కంపెనీలు రిజిస్ట్రేషన్ కు వచ్చాయి. ఇక కుటీర పరిశ్రమలు, వ్యాపారాలకు సంబంధించి 355, ఇన్వెస్ట్ మెంట్ కంపెనీలు 319, లాభార్జన ఆశించిన సంస్థలు 224, సోలిడటరీ కంపెనీలు 93, వీధి వ్యాపారాలు 54, లిమిటెడ్ కంపెనీలు 47 చొప్పున రిజిస్టర్ అయినట్లు ఎంసీఐఐసీ వెల్లడించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







