అణు శాస్త్రవేత్త హత్యపై ఇరాన్ ఆగ్రహం
- November 29, 2020
టెహ్రాన్:మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్త నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తమ దేశానికి చెందిన ప్రముఖ అణు శాస్త్రవేత్త మొహసిన్ ఫక్రిజడే దారుణ హత్యపై ఇరాన్ మండిపడుతోంది. ఆయన హత్యకు ఇజ్రాయెల్ కారణమని, ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఇరాన్ రాజధాని టెహరాన్ కు సుమారు 50 మైళ్ళ దూరంలోని అబ్సార్డ్ ప్రాంతంలో 12 మంది దుండగులు మొహసిన్ వస్తున్న కాన్వాయ్ పై బాంబులు విసిరారు. కాల్పులు జరిపారు. వీరిలో కొందరు ఆయనను కారు నుంచి బయటికి లాగి కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. ఈ హత్యకు మొత్తం 62 మంది కుట్ర పన్నారని ఇరానియన్ జర్నలిస్ట్ ఒకరు తెలిపారు. ఇరాన్ జుడిషియల్ చీఫ్ అయతుల్లా ఇబ్రహీం రైసీ, తదితరులు మొహసిన్ శవపేటిక వద్ద ఆయనకు నివాళులు అర్పించారు. కాగా మధ్య ప్రాచ్య దేశాలు సంయమనంతో వ్యవహరించాలని, ఉద్రిక్తతలకు పోరాదని ఐక్యరాజ్యసమితి కోరింది. అమెరికా మిత్ర దేశమైన ఇజ్రాయెల్ పై ఇరాన్ ఎప్పటినుంచో తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ దాడిని బహుశా అమెరికా పరోక్షంగా ప్రోత్సహించి ఉండవచ్చునని భావిస్తోంది.
తాజా వార్తలు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!
- సలాలాలో కాల్పుల కలకలం..ఇద్దరికి గాయాలు..!!
- కీలక ఓవర్నైట్ రేటును 4.25% వద్దే పెట్టిన సీబీబీ..!!
- ఆర్థిక సహకారానికి ముందు ఇరాన్ విశ్వాసాన్ని పునరుద్ధరించాలి..!!
- యూఏఈ గ్రోసరీ బిల్లులు ఎప్పుడు తగ్గుతాయి?









