చైనా ఎత్తుగడ.. బ్రహ్మపుత్ర నదిపై భారీ ప్రాజెక్టు!
- November 30, 2020
బ్రహ్మపుత్ర నదిపై చైనా డ్యామ్ను నిర్మించే ఆలోచనలో ఉన్నది. టిబెట్లో ఆ హైడ్రోపవర్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను చైనా తన 14వ పంచవర్ష ప్రణాళికలో కేటాయించించింది. డ్యామ్ నిర్మాణానికి చైనా కంపెనీకి కూడా బాధ్యతలు అప్పగించినట్లు కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. చైనా పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ చైర్మన్ యాన్ జియాంగ్ ఈ అంశంపై మాట్లాడారు. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో యార్లంగ్ జాంగ్బో నదిగా పిలుస్తారు. అయితే ఆ నదిపై హైడ్రోపవర్ డ్యామ్ను కట్టనున్నట్లు యాన్ జియాంగ్ తెలిపారు. జలవనరులు, స్వదేశీ భద్రత అంశాలను కూడా ఆ డ్యామ్తో పరిశీలించనున్నట్లు చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పేర్కొన్నది. చరిత్రలో ఇటువంటి సందర్భం ఏదీ లేదని, చైనా హైడ్రోపవర్ పరిశ్రమకు ఇదో అద్భత అవకాశం అని యాన్ జియాంగ్ తెలిపారు. వచ్చే ఏడాది ఎన్పీసీ సమావేశాల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి ప్రణాళికను వెల్లడించనున్నారు.
బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్ కట్టాలనుకుంటున్న చైనా ప్రతిపాదన పట్ల భారత్, బంగ్లాదేశ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ చైనా మాత్రం అటువంటి సమస్య ఏదీ ఉండదని పేర్కొన్నది. అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని డ్యామ్ కట్టేందుకు పూనుకున్నట్లు చైనా చెప్పింది. దిగువ దేశాల ప్రయోజనాల గురించి ఆలోచించాలని పలుమార్లు చైనాకు భారత్ అభ్యర్థన చేసింది. ఇప్పటికే టిబెట్లో 2015లో జామ్ హైడ్రోపవర్ స్టేషన్ను సుమారు 1.5 బిలియన్ల డాలర్ల ఖర్చుతో చైనా నిర్మించింది. అరుణాచల్ ప్రదేశ్తో సరిహద్దుల్లో ఉన్న టిబెట్లోని మిడాంగ్ జిల్లాలో కొత్త డ్యామ్ను చైనా నిర్మించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్లో ఆలీ వాక్వేకు కొత్త రూపు..!!
- ఖతార్లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్వేస్తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







