మూడు వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థలతో ప్రధాని మోదీ సమీక్ష
- November 30, 2020
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి కృషి చేస్తున్న మరో మూడు సంస్థల ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. జెనోవా జయోఫార్మా, బయోలాజికల్ ఈ, డాక్టర్ రెడ్డీస్ సంస్థల ప్రతినిధులతో మోడి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు, సామర్థ్యం తదితర సమాచారాన్ని ప్రజలకు అర్ధమయ్యేలా తేలికైన భాషలో చెప్పేందుకు ప్రయత్నించాలని కరోనా వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్న ఫార్మా సంస్థలకు ప్రధాని మోడి సూచించారు. వ్యాక్సిన్ పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. పుణెకు చెందిన జెనోవా బయోఫార్మా లిమిటెడ్, హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. వ్యాక్సిన్ రవాణా, భద్రత, పంపిణీ తదితర అంశాలపైనా ప్రధాని చర్చించినట్టు పీఎంఓ కార్యాలయం తెలిపింది. వ్యాక్సిన్ అభివృద్ధికి మూడు సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని మోడి ప్రశంసించారు.
తాజా వార్తలు
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్