శివసేనలోకి చేరిన 'రంగీలా' నటి
- December 01, 2020ముంబయి: బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళా మటోండ్కర్ మంగళవారం శివసేనలో చేరారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్పై పోటీ చేసి పరాజయం చెందిన 46 ఏళ్ల ఊర్మిళ గత ఏడాది సెప్టెంబర్లో కాంగ్రెస్ను విడిచిపెట్టారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నివాసంలో ఆయన సమక్షంలో ఆమె శివసేనలో చేరారు.
కాగా..గవర్నర్ కోటాలో ఊర్మిళ పేరును శాసన మండలి సభ్యత్వానికి ఇటీవలనే గవర్నర్ బిఎస్ కోష్యారీకి శివసేన సిఫార్సు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. గత ఏడాది ఉత్తర ముంబయి లోక్సభ స్థానంలో పోటీ చేసి బిజెపి అభ్యర్థి గోపాల్ షెట్టి చేతిలో ఓడిపోయిన ఊర్మిళ ఇటీవల ముంబయిని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరుతో పోలుస్తూ వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్