శివసేనలోకి చేరిన 'రంగీలా' నటి
- December 01, 2020ముంబయి: బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళా మటోండ్కర్ మంగళవారం శివసేనలో చేరారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్పై పోటీ చేసి పరాజయం చెందిన 46 ఏళ్ల ఊర్మిళ గత ఏడాది సెప్టెంబర్లో కాంగ్రెస్ను విడిచిపెట్టారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నివాసంలో ఆయన సమక్షంలో ఆమె శివసేనలో చేరారు.
కాగా..గవర్నర్ కోటాలో ఊర్మిళ పేరును శాసన మండలి సభ్యత్వానికి ఇటీవలనే గవర్నర్ బిఎస్ కోష్యారీకి శివసేన సిఫార్సు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. గత ఏడాది ఉత్తర ముంబయి లోక్సభ స్థానంలో పోటీ చేసి బిజెపి అభ్యర్థి గోపాల్ షెట్టి చేతిలో ఓడిపోయిన ఊర్మిళ ఇటీవల ముంబయిని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరుతో పోలుస్తూ వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం