తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు..
- December 02, 2020
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో సోమవారం రాత్రి 8గంటల నుంచి మంగళవారం రాత్రి 8గంటల వరకు 51,562 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 565 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. బుధవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,70,883కి చేరింది. గత 24గంటల్లో ఒకరు మాత్రమే కరోనా బారినపడి మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,462కి చేరింది. ఇక, కరోనా వైరస్ నుంచి నిన్న 925 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య 2,60,155కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9,266 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 7,219 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇక, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 55,51,620కి చేరింది.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







