బహ్రెయిన్ బోట్లను అడ్డుకున్న ఖతార్..తప్పుబట్టిన బహ్రెయిన్ ప్రభుత్వం
- December 02, 2020
మనామా:తమ సముద్ర ప్రాదేశీక జలాల్లోకి వచ్చారంటూ ఖతార్ కోస్ట్ గార్డు బృందాలు..తమ బోట్లను అడ్డుకోవటంపై బహ్రెయిన్ తప్పుబట్టింది. బహ్రెయిన్ కు చెందిన బోట్లు తమ పరిధిలోని ప్రాదేశిక జలాల్లోనే ఉండగానే...వాటిని ఖతార్ అడ్డుకోవటం సరికాదంటూ ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని గుర్తు చేసింది. ఇప్పుడు మళ్లీ తమ బోట్లను అడ్డుకొని ఖతార్ కోస్ట్ గార్డ్ తమ దురుసుతనాన్ని పదే పదే చాటుకుంటున్నాయని అభ్యంతరం తెలిపింది. అంతేకాదు...ప్రాదేశిక జలాల్లో పాటించాల్సిన అంతర్జాతీయ నిబంధనలను కూడా ఖతార్ పాటించటం లేదని ఆరోపించింది. నిబంధనల మేరకు ఖతార్ కోస్ట్ గార్డ్ తమ పతాకాలను ప్రదర్శించాల్సి ఉన్నా...అలాంటి చర్యలు తీసుకోలేదని వివరించింది. అదే సమయంలో ఖతార్ కు చెందిన రెండు బోట్ల కెప్టెన్లు అంతర్జాతీయ నిబంధనల మేరకు పతాకాలను ప్రదర్శించటంతో పాటు..అంతర్గత మంత్రిత్వ శాఖ చిహ్నాన్ని కూడా ప్రదర్శించి స్వీయ నియంత్రణను, క్రమశిక్షణను, వృత్తి విలువలను చాటుకున్నారని ప్రశంసించింది.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









