బహ్రెయిన్ బోట్లను అడ్డుకున్న ఖతార్..తప్పుబట్టిన బహ్రెయిన్ ప్రభుత్వం
- December 02, 2020
మనామా:తమ సముద్ర ప్రాదేశీక జలాల్లోకి వచ్చారంటూ ఖతార్ కోస్ట్ గార్డు బృందాలు..తమ బోట్లను అడ్డుకోవటంపై బహ్రెయిన్ తప్పుబట్టింది. బహ్రెయిన్ కు చెందిన బోట్లు తమ పరిధిలోని ప్రాదేశిక జలాల్లోనే ఉండగానే...వాటిని ఖతార్ అడ్డుకోవటం సరికాదంటూ ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని గుర్తు చేసింది. ఇప్పుడు మళ్లీ తమ బోట్లను అడ్డుకొని ఖతార్ కోస్ట్ గార్డ్ తమ దురుసుతనాన్ని పదే పదే చాటుకుంటున్నాయని అభ్యంతరం తెలిపింది. అంతేకాదు...ప్రాదేశిక జలాల్లో పాటించాల్సిన అంతర్జాతీయ నిబంధనలను కూడా ఖతార్ పాటించటం లేదని ఆరోపించింది. నిబంధనల మేరకు ఖతార్ కోస్ట్ గార్డ్ తమ పతాకాలను ప్రదర్శించాల్సి ఉన్నా...అలాంటి చర్యలు తీసుకోలేదని వివరించింది. అదే సమయంలో ఖతార్ కు చెందిన రెండు బోట్ల కెప్టెన్లు అంతర్జాతీయ నిబంధనల మేరకు పతాకాలను ప్రదర్శించటంతో పాటు..అంతర్గత మంత్రిత్వ శాఖ చిహ్నాన్ని కూడా ప్రదర్శించి స్వీయ నియంత్రణను, క్రమశిక్షణను, వృత్తి విలువలను చాటుకున్నారని ప్రశంసించింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు..కొత్త రూల్స్ ఇవే
- తమిళనాడులో ‘మేనమామ బంగారు ఉంగరం’ పథకం..
- ‘ఓణత్తాళం’ కార్యక్రమంలో భారత రాయబారి డా. శ్రీకర్ రెడ్డి
- బీసీసీఐ 95వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయాలు
- దుబాయ్: కార్మికుల వసతి గదిలో ఒక్కొక్కరికి 3.7 చదరపు మీటర్ల స్థలం తప్పనిసరి
- హైదరాబాద్లో ‘న్యూ ఐడెంటిటీ’ ఫ్లాగ్షిప్ స్టోర్ ప్రారంభం
- తెలంగాణ పోలీస్లో వనరుల ఆప్టిమైజేషన్..రూ.90 కోట్లకు పైగా ఆదా
- అమరావతి అభివృద్ధి పై CRDA కీలక నిర్ణయాలు
- గుడ్ న్యూస్..డెంగీ వ్యాక్సిన్ వచ్చేస్తోంది
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్తో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ







