బహ్రెయిన్ బోట్లను అడ్డుకున్న ఖతార్..తప్పుబట్టిన బహ్రెయిన్ ప్రభుత్వం
- December 02, 2020
మనామా:తమ సముద్ర ప్రాదేశీక జలాల్లోకి వచ్చారంటూ ఖతార్ కోస్ట్ గార్డు బృందాలు..తమ బోట్లను అడ్డుకోవటంపై బహ్రెయిన్ తప్పుబట్టింది. బహ్రెయిన్ కు చెందిన బోట్లు తమ పరిధిలోని ప్రాదేశిక జలాల్లోనే ఉండగానే...వాటిని ఖతార్ అడ్డుకోవటం సరికాదంటూ ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని గుర్తు చేసింది. ఇప్పుడు మళ్లీ తమ బోట్లను అడ్డుకొని ఖతార్ కోస్ట్ గార్డ్ తమ దురుసుతనాన్ని పదే పదే చాటుకుంటున్నాయని అభ్యంతరం తెలిపింది. అంతేకాదు...ప్రాదేశిక జలాల్లో పాటించాల్సిన అంతర్జాతీయ నిబంధనలను కూడా ఖతార్ పాటించటం లేదని ఆరోపించింది. నిబంధనల మేరకు ఖతార్ కోస్ట్ గార్డ్ తమ పతాకాలను ప్రదర్శించాల్సి ఉన్నా...అలాంటి చర్యలు తీసుకోలేదని వివరించింది. అదే సమయంలో ఖతార్ కు చెందిన రెండు బోట్ల కెప్టెన్లు అంతర్జాతీయ నిబంధనల మేరకు పతాకాలను ప్రదర్శించటంతో పాటు..అంతర్గత మంత్రిత్వ శాఖ చిహ్నాన్ని కూడా ప్రదర్శించి స్వీయ నియంత్రణను, క్రమశిక్షణను, వృత్తి విలువలను చాటుకున్నారని ప్రశంసించింది.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







