GHMC ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ముందంజ

- December 04, 2020 , by Maagulf
GHMC ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ముందంజ

హైదరాబాద్:GHMC‌ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికి టీఆర్‌ఎస్‌-65, బీజేపీ-35, ఎంఐఎం-31, కాంగ్రెస్‌-3 డవిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మెట్టుగూడ, యూసుఫ్‌గూడ, బోరబండ, హైదర్‌నగర్‌, రామచంద్రాపురంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. ఏఎస్‌ రావు నగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి శిరీషారెడ్డి గెలుపొందారు. మంగళ్‌హాట్‌లో బీజేపీ అభ్యర్థి శశికళ విజయం సాధించారు.మజ్లిస్‌ అభ్యర్థులు మెహదీపట్నం, డబీర్‌పురం, చంద్రాయణగుట్ట, అహ్మద్‌ నగర్‌, పత్తర్‌గట్టిలో గెలుపొందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com