దుబాయ్‌ పర్యటనకు బయలుదేరిన తెలంగాణ హోంమంత్రి

- February 18, 2016 , by Maagulf
దుబాయ్‌ పర్యటనకు బయలుదేరిన తెలంగాణ హోంమంత్రి

దళారులు, ఏజెంట్ల ద్వారా అరబ్‌ దేశాలకు వెళ్తున్న కార్మికులు మోసపోతున్నారని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్శింహారెడ్డి అన్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఆయన శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి దుబాయ్‌ బయలుదేరి వెళ్లారు. దుబాయ్‌లో ప్రముఖ కంపెనీలతో చర్చించి వారికి ఏ తరహా కార్మికులు కావాలో అడిగి తెలుసుకోనున్నారు. తెలంగాణలో టామ్‌కామ్‌ అనే సంస్థ ద్వారా దుబాయ్‌ సంస్థలతో ఎంఓయూ చేసుకోనున్నారు. దీనివల్ల తెలంగాణ కార్మికులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని నాయిని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com