మోదీ, షరీఫ్ మరోసారి భేటీ!
- February 18, 2016
భారత్, పాకిస్థాన్ ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ లు మరోసారి భేటీకానున్నట్లు తెలిసింది. గత డిసెంబర్ లో మోదీ ఆకస్మిక లాహోర్ పర్యటనతో వేగం పుంజుకుని, జనవరిలో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడితో శాంతి చర్చలు అర్థంతరంగా నిలిచిపోయిన నేపథ్యంలో ఈ ఇరువురి కలయికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.వాషింగ్టన్ వేదికగా మార్చి మాసాంతంలో ప్రారంభం కానున్న ప్రపంచ అణుసదస్సులో ఇరుదేశాల ప్రధానులు ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం ఉంటుందని విశ్వసనీయంగా తెలిసింది. రెండు రోజుల పాటు జరిగే అణు సదస్సు(మార్చి 31, ఏప్రిల్ 1)కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నేతృత్వం వహిస్తారు.ఈ తరహా సదస్సుకు దాయాది దేశాల ప్రధానులు ఇద్దరూ హాజరుకావటం ఇదే మొదటిసారి కావడం విశేషం.ప్రపంచ దేశాల అణుకార్యక్రమాలు, పర్యవసానాలు, అణుశక్తి వినియోగం తదితర అంశాలపై ఈ సదస్సులో పలు తీర్మానాలను ఆమోదించే అవకాశం ఉంది. కాగా, మోదీ పర్యటనపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అటు పాక్ అధికారులు మాత్రం ఇద్దరి భేటీ ఖాయమంటున్నారు. అయితే భారత్- పాక్ చర్చల ప్రక్రియ ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఊహించడం అసాధ్యమని పరిశీలకుల భావన.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







