మోదీ, షరీఫ్ మరోసారి భేటీ!
- February 18, 2016
భారత్, పాకిస్థాన్ ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ లు మరోసారి భేటీకానున్నట్లు తెలిసింది. గత డిసెంబర్ లో మోదీ ఆకస్మిక లాహోర్ పర్యటనతో వేగం పుంజుకుని, జనవరిలో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడితో శాంతి చర్చలు అర్థంతరంగా నిలిచిపోయిన నేపథ్యంలో ఈ ఇరువురి కలయికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.వాషింగ్టన్ వేదికగా మార్చి మాసాంతంలో ప్రారంభం కానున్న ప్రపంచ అణుసదస్సులో ఇరుదేశాల ప్రధానులు ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం ఉంటుందని విశ్వసనీయంగా తెలిసింది. రెండు రోజుల పాటు జరిగే అణు సదస్సు(మార్చి 31, ఏప్రిల్ 1)కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నేతృత్వం వహిస్తారు.ఈ తరహా సదస్సుకు దాయాది దేశాల ప్రధానులు ఇద్దరూ హాజరుకావటం ఇదే మొదటిసారి కావడం విశేషం.ప్రపంచ దేశాల అణుకార్యక్రమాలు, పర్యవసానాలు, అణుశక్తి వినియోగం తదితర అంశాలపై ఈ సదస్సులో పలు తీర్మానాలను ఆమోదించే అవకాశం ఉంది. కాగా, మోదీ పర్యటనపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అటు పాక్ అధికారులు మాత్రం ఇద్దరి భేటీ ఖాయమంటున్నారు. అయితే భారత్- పాక్ చర్చల ప్రక్రియ ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఊహించడం అసాధ్యమని పరిశీలకుల భావన.
తాజా వార్తలు
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు







