తెలంగాణలో కొత్తగా 596 కరోనా కేసులు
- December 05, 2020హైదరాబాద్:తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా రాష్ట్రంలో 596 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 2,72,719కి చేరింది. అలాగే… శుక్రవారం వైరస్ కారణంగా ముగ్గురు ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1470కి చేరింది. తెలంగాణలో శుక్రవారం 921 మంది వ్యాాధి బారి నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 2,62,751కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8498 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటిలో 6465 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. తెలంగాణలో డెత్ రేటు 0.53 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 96.34 శాతంగా ఉంది.
తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం 59,471 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసింది. ఫలితంగా మొత్తం టెస్టుల సంఖ్య 57,22,82కి చేరింది. 803 టెస్టుల రిపోర్ట్స్ రావాల్సి ఉంది. GHMC పరిధిలో కొత్తగా 102 కేసులు వెలుగుచూశాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో 47, రంగారెడ్డి జిల్లాలో 46, కరీంనగర్ జిల్లాలో 36 కేసులు నమోదయ్యాయి. నారాయణ పేటలో మాత్రం నిన్న ఒక్క కేసు కూడా నమోదుకాలేదు.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!