టీ20 సిరీస్ భారత్ కైవసం..

- December 06, 2020 , by Maagulf
టీ20 సిరీస్ భారత్ కైవసం..

సిడ్నీ:టీమిండియా అద్భుతమైన పోరాటం ఫలించింది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలో భారత క్రికెట్‌ జట్టు అద్భుత‌ ప్రదర్శన చేసింది. ఆదివారం సిడ్నీ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే భారత్‌ 2-0తో కైవసం చేసుకున్నది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య కేవలం 22 బంతుల్లో 42 పరుగులు చేశాడు. 3ఫోర్లు, 2సిక్సర్లతో వీరవిహారం చేయడంతో టీమిండియా 2 బంతులు మిగిలుండగానే టార్గెట్‌ను ఛేదించింది.

195 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా… ‌ నాలుగు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలోనే ఛేదించింది. డేనియల్‌ సామ్స్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు సాధించి హార్దిక్‌ (42) జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో కోహ్లీ సేన మరో మ్యాచ్‌ మిగిలుండగానే టీ20 సిరీస్ కైవసం చేసుకుంది.‌

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com