కవితకు గల్ఫ్ బోర్డ్ ఏర్పాటు చెయ్యాలని వినపత్రం అందించిన కార్మిక సంఘాల నాయకులు
- December 06, 2020
హైదరాబాద్:గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న తెలంగాణ ప్రవాసీయుల కోసం గల్ఫ్ బోర్డ్ అతి త్వరగా ఏర్పాటు చెయ్యాలని ఇదివరకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయక వర్గం అయిన కల్వకుంట్ల కవిత(ఎం.యల్.సి) ,రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి,పార్లమెంటు సభ్యుడు బి.బి.పాటిల్ మొదలగు వారిని కలిసి బడ్జెట్ తో కూడిన బోర్డు ఏర్పాటు చెయ్యాలని కోరారు.దాంట్లో ముఖ్యం గా చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా , సురక్షిత వలసలకు , విదేశాల్లో వివిధ కారణాలతో ఇరుక్కున్న వారిని రప్పించడం , తిరిగి వచ్చిన వారికి ఉపాధి , వైద్య విద్య హామీలు, భీమా పధకాల మీద , నైపుణ్యత అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని, మోసాలను అరికట్టి వారికి కఠిన శిక్షలు జరిమానాలు విధించాలని తెలుపగా నాయకులు సానుకూలంగా స్పందించారు.
కవితని కలిసిన వారిలో కోటపాటి అధ్యక్షతన గల్ఫ్ JAC కు సంబంధించిన వివిధ సంఘాల నాయకులు సంపత్ దాసరి, గుగ్గిల్ల రవి గౌడ్, కోటపాటి నరసింహ నాయుడు, ఏముల రమేష్ ,జనగామ శ్రీనివాస్, గంగుల మురళీధర్ రెడ్డి, జంగం బాలకిషన్ మరియు పరికిపండ్ల స్వదేష్ తదితరులు ఉన్నారు.అవసరమున్న చోట ప్రభుత్వానికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని సంఘాల నాయకులు తెలియజేసారు.



తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







