ఒమన్: వచ్చే ఏడాది నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ విధానం తొలగింపు
- December 07, 2020
వచ్చే ఏడాది నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఒమన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యిద్ వెల్లడించారు. కార్మిక విధానాల్లో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 16వ ఐఐఎస్ఎస్ మనామా సదస్సులో మాట్లాడిన ఆయన...ఇన్నాళ్లుగా తమ దేశం అవలంభించిన నిరంభ్యంతర షరతుల విధానాల తొలిగించబోతున్నామని అన్నారు. ఇది ఒమన్ విజన్ 2040కి అనుగుణంగా సుల్తానేట్ ఆర్ధికాభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. దీంతో పాటు దేశంలో పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేలా వీసా విధానాల్లోనూ మార్పు తీసుకొస్తున్నట్లు తెలిపారు. దాదాపు వంద దేశాలకు చెందిన పౌరులు ఒమన్ కు వీసా లేకుండా ప్రయాణించేలా తాము ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. నెల రోజుల పాటు దేశంలో పర్యటించే వారికి వీసా ఫ్రీ విధానాన్ని ప్రకటించబోతున్నట్లు తెలిపారు. వీసా విధానాల్లో మార్పులు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ విధానం తొలగింపు జనవరి 1,2021 నుంచి అమలు చేయబోతున్నట్లు..తద్వారా ప్రవాసీయులు తమ ఉద్యోగాల్లో చేరేందుకు కూడా లైన్ క్లియర్ అవుతుందని విదేశాంగ శాఖ మంత్రి అన్నారు.
- లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్ )
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు