అమర జవాను ప్రవీణ్ కుమార్ రెడ్డికి రూ.2 లక్షలు పరిహారం విడుదల చేసిన గవర్నర్

- December 07, 2020 , by Maagulf
అమర జవాను ప్రవీణ్ కుమార్ రెడ్డికి రూ.2 లక్షలు పరిహారం విడుదల చేసిన గవర్నర్

విజయవాడ: జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పులలో అమరుడైన భారత సైన్యానికి చెందిన హవల్దార్ ప్రవీణ్ కుమార్ రెడ్డి భార్యకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ రెండు లక్షల రూపాయలు పరిహారంగా విడుదల చేశారు. గవర్నర్ తన విచక్షణాధికారం మేరకు ప్రత్యేకించి ఈ మొత్తాన్ని మంజూరు చేసారు. చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లెకు చెందిన సిపాయి దివంగత ప్రవీణ్ కుమార్ రెడ్డి భార్యకు ఈ మొత్తాన్ని బదిలీ చేయించే క్రమంలో సోమవారం భారత సైన్యానికి చెందిన 18 మద్రాస్ రెజిమెంట్ కు రెండు లక్షల రూపాయల పరిహార మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com