అమర జవాను ప్రవీణ్ కుమార్ రెడ్డికి రూ.2 లక్షలు పరిహారం విడుదల చేసిన గవర్నర్
- December 07, 2020
విజయవాడ: జమ్మూ కాశ్మీర్లో ఇటీవల ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పులలో అమరుడైన భారత సైన్యానికి చెందిన హవల్దార్ ప్రవీణ్ కుమార్ రెడ్డి భార్యకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ రెండు లక్షల రూపాయలు పరిహారంగా విడుదల చేశారు. గవర్నర్ తన విచక్షణాధికారం మేరకు ప్రత్యేకించి ఈ మొత్తాన్ని మంజూరు చేసారు. చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లెకు చెందిన సిపాయి దివంగత ప్రవీణ్ కుమార్ రెడ్డి భార్యకు ఈ మొత్తాన్ని బదిలీ చేయించే క్రమంలో సోమవారం భారత సైన్యానికి చెందిన 18 మద్రాస్ రెజిమెంట్ కు రెండు లక్షల రూపాయల పరిహార మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









