WHO ఫౌండేషన్ సీఈవోగా భారత సంతతి వ్యక్తి
- December 08, 2020
జెనీవా: భారత సంతతికి చెందిన అనిల్ సోని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఫౌండేషన్ సీఈవోగా నియామకమయ్యారు. వచ్చే జనవరి 1 న డబ్ల్యూహెచ్ఓ ఫౌండేషన్ ప్రారంభ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సోని తన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంతకు ముందు గ్లోబర్ హెల్త్ కేటర్ కంపెనీ వట్రియాస్లో గ్లోబల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగానికి హెడ్గా కొనసాగారు. అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో వైద్యారోగ్య సదుపాయాలు కల్పించడం కోసం ప్రభుత్వ, ప్రైవేటు లాభాపేక్ష లేని రంగాల్లో 20 ఏళ్ల పాటు సేవలందించారు. ఈ సందర్భంగా అనిల్ సోనికి డబ్ల్యూహెచ్ఓ ఛీప్ టెడ్రోస్, WHO ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ఫ్రొఫెసర్ థామస్ జెల్ట్నర్ అభినందించారు.
కాగా, 2023లోగా బిలియన్ డాలర్ల నిధుల సేకరణను లక్ష్యంగా పెట్టుకుని ఓ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు WHO ఫౌండేషన్ పేర్కొంది. ఆ ఫౌండేషన్ను ఈ ఏడాది మేలో జెనీవాలో ప్రారంభించారు. ప్రపంచ ఆరోగ్య సమాజంతో కలిసి అత్యంత ఒత్తిడితో కూడిన ప్రపంచ ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడానికి ప్రారంభించారు.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









