రైతు సంఘాల ప్రతినిధులతో అమిత్షా సమావేశం
- December 08, 2020
న్యూ ఢిల్లీ:భారత్ బంద్తో కేంద్రం స్పందించింది. రైతులను చర్చలకు పిలిచింది.. కేంద్ర హోంమంత్రి అమిత్షా రైతులను చర్చలకు ఆహ్వానించారు. రైతు సంఘాల ప్రతినిధులతో అమిత్షా సమావేశం అయ్యారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈనెల 9న చర్చలు జరగాల్సి ఉన్నా.. రైతుల ఆందోళన మరింత ఉధృతం కావడంతో కేంద్రం వెంటనే స్పందించింది. కేంద్ర హోంమంత్రి అమిత్షా స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం అమలు చేస్తున్న వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ 13రోజులుగా రైతులు వివిధ రూపాల్లో ఆందోళన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్త బంద్ చేపట్టారు.. రైతులకు మద్దతుగా బీజేపీయేతర పార్టీలు బంద్లో పాల్గొన్నాయి.. మరోవైపు ఇప్పటి వరకు ఐదుసార్లు రైతులతో కేంద్రం చర్చలు జరిపినా పురోగతి కనిపించలేదు. చర్చలు జరిపిన ప్రతిసారీ ప్రతిష్టంభనే తప్ప అడుగు కూడా ముందుకు పడలేదు.. ఈ నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తాజా వార్తలు
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం









