కన్నడ హీరో చిరంజీవి కుటుంబానికి పట్టిన మహమ్మారి..జూనియర్ చిరు కు కూడా..
- December 09, 2020
కన్నడ హీరో చిరంజీవి సర్జా ఈ ఏడాది జూన్ 7న గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. దీంతో అయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చిరంజీవి చనిపోయే సమయానికి అతడి భార్య మేఘనా రాజ్ గర్భవతి. భర్త మరణాన్ని ఆమె జీర్ణించుకోలేక, ఆ బాధ నుండి బయటపడలేకపోయింది. కానీ అతడి జ్ఞాపకాలు తనను సజీవంగా నిలిపాయని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ లో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు వీరి కుటుంబానికి మరో సమస్య వచ్చింది.
ఫ్యామిలీ మొత్తం కోవిడ్ బారిన పడ్డారు. మేఘనా రాజ్ తో పాటు ఆమె తల్లి, తండ్రులకు, రెండు నెలల తన పసికందుకి కూడా కోవిడ్ సోకడం షాకిస్తుంది. ఈ విషయాన్ని మేఘనా స్వయంగా వెల్లడించింది. మంగళవారం నాడు ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఒక ప్రకటన షేర్ చేసింది. ఆ ప్రకటనలో తనతో పాటు, తన కుమారుడుకి, తల్లితండ్రులకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని.. గత కొన్ని వారాలుగా తమని కలిసి వారు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రస్తుతం కుటుంబం మొత్తం ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని తెలిపింది.
జూనియర్ చిరు ఆరోగ్యం బాగానే ఉందని.. అన్ని వేళలా తనతో ఉంటున్నానని.. కాబట్టి ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పింది. కరోనా మహమ్మారిపై యుద్ధంలో తప్పకుండా గెలుస్తామంటూ నమ్మకంగా చెప్పుకొచ్చారు. కానీ ఈ వార్త మాత్రం చిరు అభిమానులు బాధ పెడుతోంది. చిరంజీవి సర్జా కుటుంబానికి ఒకదాని తరువాత ఒకటి అన్నట్లు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









