కన్నడ హీరో చిరంజీవి కుటుంబానికి పట్టిన మహమ్మారి..జూనియర్ చిరు కు కూడా..
- December 09, 2020
కన్నడ హీరో చిరంజీవి సర్జా ఈ ఏడాది జూన్ 7న గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. దీంతో అయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చిరంజీవి చనిపోయే సమయానికి అతడి భార్య మేఘనా రాజ్ గర్భవతి. భర్త మరణాన్ని ఆమె జీర్ణించుకోలేక, ఆ బాధ నుండి బయటపడలేకపోయింది. కానీ అతడి జ్ఞాపకాలు తనను సజీవంగా నిలిపాయని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ లో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు వీరి కుటుంబానికి మరో సమస్య వచ్చింది.
ఫ్యామిలీ మొత్తం కోవిడ్ బారిన పడ్డారు. మేఘనా రాజ్ తో పాటు ఆమె తల్లి, తండ్రులకు, రెండు నెలల తన పసికందుకి కూడా కోవిడ్ సోకడం షాకిస్తుంది. ఈ విషయాన్ని మేఘనా స్వయంగా వెల్లడించింది. మంగళవారం నాడు ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఒక ప్రకటన షేర్ చేసింది. ఆ ప్రకటనలో తనతో పాటు, తన కుమారుడుకి, తల్లితండ్రులకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని.. గత కొన్ని వారాలుగా తమని కలిసి వారు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రస్తుతం కుటుంబం మొత్తం ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని తెలిపింది.
జూనియర్ చిరు ఆరోగ్యం బాగానే ఉందని.. అన్ని వేళలా తనతో ఉంటున్నానని.. కాబట్టి ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పింది. కరోనా మహమ్మారిపై యుద్ధంలో తప్పకుండా గెలుస్తామంటూ నమ్మకంగా చెప్పుకొచ్చారు. కానీ ఈ వార్త మాత్రం చిరు అభిమానులు బాధ పెడుతోంది. చిరంజీవి సర్జా కుటుంబానికి ఒకదాని తరువాత ఒకటి అన్నట్లు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు