అబుదాబీలో ఇండియన్ పాస్పోర్ట్ రెన్యువల్: కొత్త నిబంధన
- December 09, 2020
అబుధాబి: జనవరి 31 లోపు గడువు తీరే పాస్పోర్టుల రెన్యువల్ మాత్రమే చేపడుతున్నట్లు అబుదాబీలోని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. తదుపరి నోటీస్ వచ్చేవరకూ ఈ నిబంధన అమల్లో వుంటుందని ఎంబసీ మిషన్ పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అత్యవసరంగా పాస్పోర్ట్ సేవలు కావాల్సినవారు, తమ డాక్యుమెంట్లను మెయిల్ చేయాల్సి వుంటుంది. ఎమర్జన్సీకి సంబంధించిన వివరాల్ని కూడా ఇ-మెయిల్లో వెల్లడించాలి. ఎంబసీ, అలాంటి అత్యవసర విషయాలపై తక్షణం స్పందించి, తదిన కాన్సులర్ సేవలు అందించడం జరుగుతుంది. గత నెలలో ఎంబసీ మరో సూచన కూడా చేయడం జరిగింది. కంపెనీ పీఆర్వోల ద్వారా ఉద్యోగుల అప్లికేషన్లను సమర్పించడానికి అవకాశం కల్పించారు. తద్వారా నేరుగా కంపెనీ ఎంప్లాయిస్ ఎంబసీని ఆశ్రయించాల్సిన అవసరం వుండదు. అంతకు ముందు సమీపంలోని బిఎల్ ఎస్ సెంటర్ వద్ద వ్యక్తిగతంగా దరఖాస్తుదారులు హాజరవ్వాల్సి వచ్చేది.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







