ఇండియాకి మరిన్ని విమాన సర్వీసుల ప్రకటన

- December 09, 2020 , by Maagulf
ఇండియాకి మరిన్ని విమాన సర్వీసుల ప్రకటన

మస్కట్‌: ఇండియాకి పలు ఎయిర్‌ లైన్స్‌లు అదనపు విమాన సర్వీసుల్ని ప్రకటిస్తున్నాయి. సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ, వీక్లీ విమానాల సంఖ్యను ఇరు దేశాల మధ్య పెంచడంతో ఈ వెసులుబాటు కలిగింది. ట్రావెల్‌ ఏజెంట్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎయిర్‌ ఇండియా ఢిల్లీ, ముంబై లకు అదనపు విమానాల్ని నడపనుంది. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ రెండు అదనపు విమానాల్ని సౌత్‌ ఇండియాకి నడపనుంది. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ కోచి, త్రివేండ్రమ్‌లకు అదనపు విమాన సర్వీసుల్ని నడుపుతుంది. ఢిల్లీకి అలాగే ముంబైకి ఎయిర్‌ ఇండియా నాలుగు వీక్లీ విమానాలు నడుపుతుంది. సిఎఎ వెల్లడించిన వివరాల ప్రకారం ఇరు దేశాల మధ్య 12,000 సీట్ల షేరింగ్‌ వుంటుంది. చెరో వైపు 6000 సీట్లు పంపకం జరుగుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com