ఉద్యోగుల రిమోట్ వర్కింగ్ ప్రోటోకాల్స్కి షేక్ హమదాన్ ఆమోదం
- December 11, 2020
దుబాయ్:తమ కార్యాలయాల వెలుపల దుబాయ్లోని ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసేందుకు వీలుగా ప్రొటోకాల్స్ని రూపొందించారు. వీటినికి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆమోదం తెలిపారు. ఉద్యోగుల సామర్థ్యం ఈ రిమోట్ వర్కింగ్ విధానం ద్వారా మరింత పెరుగుతుందని ఆయన చెప్పారు. కరోనా నేపథ్యంలో ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా వుంటుందనీ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సులువుగా ఉపయోగించడానికి వీలవుతుందని షేక్ హమదాన్ అభిప్రాయపడ్డారు. ఆఫ్ సైట్లో పని చేయడం వల్ల ఎవరి పని మీద అయితే ప్రత్యేకంగా ప్రభావం చూపదో, అలాంటివారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఒకవేళ విదేశాల్లో వివిధ కారణాలతో ఆయా ఉద్యోగులు చిక్కుకుపోయినా, అక్కడి నుంచి కూడా వారు విధులు నిర్వర్తించే అవకాశం ఇస్తుండడం గమనార్హం. దుబాయ్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా అలి బిన్ జాయెద్ అల్ ఫలాసి మాట్లాడుతూ, ఆయా ఉద్యోగుల సామర్థ్యాన్ని మరింత పెంచేలా, వారి ఔట్ పుట్ ఇంకా పెరిగేలా ఈ తరహా నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. ఆపరేషనల్ కాస్ట్ తగ్గడం, ట్రాఫిక్ సమస్యలు తగ్గడం, ప్రోడక్టివిటీ పెరగడం వంటి లాభాలు ఇందులో వున్నాయన్నారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







