కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవటం తప్పనిసరేం కాదు..ప్రజలకు సౌదీ స్పష్టత
- December 12, 2020
రియాద్:కోవిడ్ 19కి విరుగుడుగా అందుబాటులోకి వచ్చిన ఫైజర్-బయోన్టెక్ వ్యాక్సిన్ అందరూ ఖచ్చితంగా తీసుకోవాలని తామేం నిబంధనలు పెట్టడం లేదని సౌదీ అరోగ్య శాఖ స్పష్టత ఇచ్చింది. స్వచ్ఛదంగా ముందుకు వచ్చిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తామని వెల్లడించింది. అయితే ఆరోగ్య శాఖ సిబ్బంది మరీ ముఖ్యంగా కోవిడ్ పేషెంట్లను ట్రీట్ చేసే వారు మాత్రం వ్యాక్సిన్ వేయించుకోటం శ్రేయస్కరమని అభిప్రాయపడింది. సౌదీ ఆహార, ఔషధ నియంత్రణ అధికార విభాగం..గత వారమే ఫైజర్ వ్యాక్సిన్ ఆమోదం తెలుపటంతో అతి త్వరలోనే కింగ్డమ్ కు వ్యాక్సిన్ చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే..వ్యాక్సిన్ రాగానే ప్రజలకు ఇవ్వబోమని..ప్రతీ బ్యాచ్ లో వ్యాక్సిన్ ను ముందుగా పూర్తిగా విశ్లేషించిన తర్వాతే ఇస్తామని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఫైజర్ వ్యాక్సిన్ సురక్షితమని చెప్పటంలో తమకు ఎలాంటి అనుమానం లేదని, అయితే..ప్రజల్లో మాత్రం వ్యాక్సిన్ దుష్ఫ్రభావాలకు దారితీస్తుందనే ఆందోళన ఉన్నమాట నిజమేనని వెల్లడించింది. అందుకే ప్రజలకు నమ్మకం కలిగిలే ముందుగానే ప్రతి బ్యాచ్ లో వ్యాక్సిన్ శాంపిల్ ను పరిశీలిస్తామని వివరించింది. అంతేకాదు...ఏడాదికి ముందు వ్యాక్సిన్ కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్, సైడ్ ఎఫెక్ట్స్, తుది ఆమోదం గురించి సాధారణ ప్రజలకు తెలిసేది కాదని వెల్లడించింది. కానీ, కోవిడ్ నేపథ్యంలో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, వ్యాక్సిన్ వివరాలపై ప్రజలకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు
- కువైట్ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సముదాయం పై డ్రోన్ దాడి
- తెలంగాణ ప్రజలకు అలెర్ట్..









