విలక్షణ నటీమణి గీతాంజలి
- December 13, 2020
వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక, శారదా కళాసమితి విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాలంలో డిసెంబర్ 12వ తేదీన ప్రజా నటి, కళాభారతి డాక్టర్ జమునా రమణా రావుకు స్వర్ణయుగ సినీనటి గీతాంజలి - వంశీ జాతీయ పురస్కారం -- 2020 ప్రదానం చేశారు... ఆ సందర్భంగా పురస్కార గ్రహీత జమునా రమణా రావు మాట్లాడుతూ, "గీతాంజలి మహానటి సావిత్రి తర్వాత తనకెంతో ఆప్తురాలనీ, ఒకరకంగా గీతాంజలి కూడా మహానటి కోవకు చెందినదే అనీ తమకంటే ఆమె దేనిలోనూ తక్కువ కాదనీ, తన 13ఏళ్ల వయసులోనే ఎన్టీ రామారావు నిర్మించిన సీతారామ కళ్యాణం లో సీతగా నటించి నిజంగా సీత అంటే ఇలాగే ఉండేది కాబోలు అనుకునే విధంగా మాలాంటి నటీమణులను కూడా తన్మయత్వం లో ముంచిన ఒక విలక్షణ నటి" అని ప్రశంసించారు..గీతాంజలి పేర స్థాపించిన మొట్టమొదటి అవార్డు తాను స్వీకరించడం ఆనందంగా ఉంది అన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మండలి బుద్ధప్రసాద్ పూర్వ ఉపసభాపతి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, రేలంగి నరసింహారావు ప్రముఖ సినీ దర్శకులు, భువనచంద్ర ప్రముఖ సినీ గేయ రచయిత, డాక్టర్ కె.వి కృష్ణకుమారి ప్రముఖ రచయిత్రి, సినీ విజ్ఞాన విశారద ఎస్ వి రామారావు, శారదాకళాసమితి అధ్యక్షులు డోగిపర్తి శంకర్రావు, దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక ఉపాధ్యక్షులు గౌతమలింగ, వంశీ అధ్యక్షురాలు డాక్టర్ తెన్నేటి సుధాదేవి, వంశీ మేనేజింగ్ ట్రస్టీ శైలజా సుంకరపల్లి, వంశీ వ్యవస్థాపకులు శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమాన్ని గీతాంజలి కుమారుడు జి శ్రీనివాస్ జ్యోతి ప్రకాశనం చేసి ప్రారంభించారు.. తన తల్లి పేర అవార్డు స్థాపించి డా. జమున కు ప్రదానం చేయడం తమ కుటుంబానికి ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు.. గీతాంజలి పేర నెలకొల్పిన ఈ పురస్కారాన్ని స్వీకరించడానికి అంగీకరించిన డాక్టర్ జమున కు అందరూ అభినందనలు తెలియజేశారు.. కాకినాడ సుచిత్ర వ్యాఖ్యానంతో " తెలుగు పాటకు పట్టాభిషేకం" అనే సినీ సంగీత విభావరిలో వి కే దుర్గ, కాజా శరత్ బాబు గీతాలను ఆలపించి రంజింపజేశారు.. ఈ కార్యక్రమానికి రామరాజు కుటుంబానికి చెందిన లక్ష్మీ శ్రీనివాస్ రామరాజు వీణపై "శ్రీ సీతారాముల కళ్యాణం" గీతాన్ని వినిపించారు.. అంతేకాకుండా రామంతపూర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని ప్రార్థన గీతం జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ ఆలపించారు..







తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







