రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న కమల్ హస్సన్
- December 14, 2020
చెన్నై:మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ సోమవారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని చెప్పారు. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న విషయాన్ని మాత్రం తర్వాత ప్రకటించనున్నట్లు కమల్ వెల్లడించారు. ఆదివారం రోజున మధురైలో కమల్హాసన్ ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో కమల్ పార్టీ అభిమానులు ఆ ర్యాలీలో పాల్గోన్నారు. ఇటీవల ప్రధాని మోడి కొత్త పార్లమెంట్ బిల్డింగ్కు శంకుస్థాపన చేయడాన్ని కమల్ తప్పుపట్టారు. సగం దేశం ఆకలి బాధతో ఉంటే, కొత్త పార్లమెంట్ బిల్డింగ్ అవసరమా అని కమల్ విమర్శలు చేశారు. తమిళనాడులో వచ్చే ఏడాది మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







