ఖతార్: ఖైదీలు తయారు చేసిన వస్తువులకు ఆన్ లైన్ మార్కెటింగ్

- December 15, 2020 , by Maagulf
ఖతార్: ఖైదీలు తయారు చేసిన వస్తువులకు ఆన్ లైన్ మార్కెటింగ్

దోహా:జైలు ఖైదీలు తయారు చేసిన పలు వస్తువులకు ఆన్ లైన్ మార్కెటింగ్ ద్వారా అమ్మకానికి తీసుకువచ్చింది అంతర్గత మంత్రిత్వ శాఖ. అందుకోసం ప్రత్యేకంగా ఈ-స్టోర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఖైదీలు తయారు చేసిన చేతి వస్తువులు, శిల్పాలతో పాటు మహిళా ఖైదీలు చేసిన బట్టలు, సంచులు, ఇతర ఉపకరణాలను మార్కెట్ చేస్తున్నారు. మంత్రిత్వ శాఖకు చెందిన వెబ్ సైట్లోనే సబ్ పోర్టల్ లో మార్కెటింగ్ కు అవకాశం కల్పించారు. నాణ్యత పరంగా అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఈ వస్తువులను ఆన్ లైన్ లో కొనుగోలు చేసుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యాన్ని కూడా ఉంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com