కోవిడ్ 19 వ్యాక్సిన్ వేయించుకున్న దుబాయ్ పారిశ్రామికవేత రిజ్వాన్ సజన్
- December 15, 2020
దుబాయ్:దుబాయ్ కి చెందిన పారిశ్రామికవేత దనుబె గ్రూప్ చైర్మన్ రిజ్వాన్ సజన్ కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్నారు. చైనాకు చెందిన సినోఫార్మ్ వ్యాక్సిన్ ను డోసులను వేయించుకున్నట్లు ఆయన తన ఇన్ స్ట్రాగ్రామ్ లో ఫోటో షేర్ చేశారు. సినోఫార్మ్ తో పాటు కోవిడ్ వ్యాక్సిన్ లపై ప్రజల్లో ఇప్పటికి కొన్ని అనుమానాలు, ఆందోళన నెలకొని ఉన్న నేపథ్యంలో రిజ్వాన్ షేర్ చేసిన ఫోటో ప్రాధాన్యతను సంతరించుకుంది. చైనాకు చెందిన సినోఫార్మ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని, అంతా సాధారణంగానే ఉందని రిజ్వాన్ చెబుతున్నారు. పకడ్బందీ ప్రమాణాలతో ప్రయోగాలు నిర్వహించిన తర్వాతే సినోఫార్మ్ మార్కెట్లోకి వచ్చిందని...అందుకే వ్యాక్సిన్ పై తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. ఇదిలాఉంటే...పౌరులు, ప్రజలకు వ్యాక్సిన్ డోసులు వేసే ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రలు జాబితాను యూఏఈ ఆరోగ్య శాఖ విడుదల చేసింది. అయితే..వాలంటరీగా వచ్చిన వారికీ మాత్రమే వ్యాక్సిన్ ఇస్తామని..బలవంతంగా ఎవరికి వ్యాక్సిన్ ఇవ్వబోమని కూడా తెలిపింది. ప్రవాసీయులు తామకు వీసా జారీ అయిన ప్రాంతంలోని ఆస్పత్రుల్లో మాత్రమే వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..







