కోవిడ్ 19 వ్యాక్సిన్ వేయించుకున్న దుబాయ్ పారిశ్రామికవేత రిజ్వాన్ సజన్

- December 15, 2020 , by Maagulf
కోవిడ్ 19 వ్యాక్సిన్ వేయించుకున్న దుబాయ్ పారిశ్రామికవేత రిజ్వాన్ సజన్

దుబాయ్:దుబాయ్ కి చెందిన పారిశ్రామికవేత దనుబె గ్రూప్ చైర్మన్ రిజ్వాన్ సజన్ కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్నారు. చైనాకు చెందిన సినోఫార్మ్ వ్యాక్సిన్ ను డోసులను వేయించుకున్నట్లు ఆయన తన ఇన్ స్ట్రాగ్రామ్ లో ఫోటో షేర్ చేశారు. సినోఫార్మ్ తో పాటు కోవిడ్ వ్యాక్సిన్ లపై ప్రజల్లో ఇప్పటికి కొన్ని అనుమానాలు, ఆందోళన నెలకొని ఉన్న నేపథ్యంలో రిజ్వాన్ షేర్ చేసిన ఫోటో ప్రాధాన్యతను సంతరించుకుంది. చైనాకు చెందిన సినోఫార్మ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని, అంతా సాధారణంగానే ఉందని రిజ్వాన్ చెబుతున్నారు. పకడ్బందీ ప్రమాణాలతో ప్రయోగాలు నిర్వహించిన తర్వాతే సినోఫార్మ్ మార్కెట్లోకి వచ్చిందని...అందుకే వ్యాక్సిన్ పై తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. ఇదిలాఉంటే...పౌరులు, ప్రజలకు వ్యాక్సిన్ డోసులు వేసే ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రలు జాబితాను యూఏఈ ఆరోగ్య శాఖ విడుదల చేసింది. అయితే..వాలంటరీగా వచ్చిన వారికీ మాత్రమే వ్యాక్సిన్ ఇస్తామని..బలవంతంగా ఎవరికి వ్యాక్సిన్ ఇవ్వబోమని కూడా తెలిపింది. ప్రవాసీయులు తామకు వీసా జారీ అయిన ప్రాంతంలోని ఆస్పత్రుల్లో మాత్రమే వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com