శబ్ద కాలుష్య వాహనాల డ్రైవర్ లకు పోలిసుల హెచ్చరిక
- February 20, 2016
విపరీత శబ్దాలను కల్గించే కొందరు వాహనాల డ్రైవర్ లను ట్రాఫిక్ అధికారులు హెచ్చరించారు. ప్రజలని ఇబ్బంది కల్గించే విధంగా బిగ్గరగా హారన్లు మోగించడం మానివేయని వారిపై ఇకపై క్రమశిక్షణ చర్యలు తీసుకోక తప్పదని ట్రాఫిక్ జనెరల్ డైరక్టర్ షేక్ నసీర్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ ఖలీఫా శుక్రవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. రణగొణ ధ్వనులను కల్గిస్తూ ప్రజలను శబ్ద కాలుష్యానికి గురిచేసే వారిపై ఇటీవల 236 ఉల్లంఘన నేరాలు నమోదయినట్లు ఆయన తెలిపారు. ఈ తరహా పిర్యాదులు ఇటీవల తమకు ఎక్కువ అయినందున రద్దీగా ఉండే రహదారులపై ట్రాఫిక్ పోలీసుల గస్తీ ని ఎక్కువగా పెంచి బిగ్గరగా హారన్లు మోగించేవారిపై చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఏ వాహనదారుడైనా అనవసర శబ్దాలను కల్గించితే, తమకు పిర్యాదు చేయాలని ఆయన కోరారు. కొంతమంది డ్రైవర్ లు తమ సాధారణ కార్లకు రేసింగ్ కార్ల శబ్దాలు ఏర్పాటు చేసుకొంటున్నారని, అవి ఎక్కడ్నుంచో వేగంగా దూసుకువచ్చినట్లు వచ్చి కీచు మనే శబ్దంతో వెనుక ఆగినట్లుగా కృత్రిమ గోల కారణంగా ప్రజలు భయపడే విధంగా వింత ధ్వనులు పెడుతున్నారని చెబ్తూ...ఇకపై వారు తామే స్వచ్చంగా తొలగించుకోవాలని సూచించారు. ఈ దేశంలో ఈ తరహా ప్రయోగాలు చెల్లవని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







