తెలంగాణలో 509 కరోనా కేసులు
- December 17, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గతంలో వేలల్లో నమోదయ్యే పాజిటివ్ కేసులు.. కరోనా కట్టడిలో భాగంగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 48,652 మందికి కరోనా పరీక్షలు నిర్వహంచగా, 509 పాజిటివ్ కేసుల నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ లో తెలిపింది. ఇక తాజాగా ముగ్గురు మృతి చెందగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,505కు చేరుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 2,79,644కు చేరుకుంది.
తాజాగా కరోనా నుంచి 517 మంది కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,70,063 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,172 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 5,063 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు 63,06,397 కరోనా పరీక్షలు నిర్వహించారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







