తెలంగాణలో 509 కరోనా కేసులు
- December 17, 2020హైదరాబాద్:తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గతంలో వేలల్లో నమోదయ్యే పాజిటివ్ కేసులు.. కరోనా కట్టడిలో భాగంగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 48,652 మందికి కరోనా పరీక్షలు నిర్వహంచగా, 509 పాజిటివ్ కేసుల నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ లో తెలిపింది. ఇక తాజాగా ముగ్గురు మృతి చెందగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,505కు చేరుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 2,79,644కు చేరుకుంది.
తాజాగా కరోనా నుంచి 517 మంది కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,70,063 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,172 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 5,063 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు 63,06,397 కరోనా పరీక్షలు నిర్వహించారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్
- 2 రోజులలో 884 విమానాలు రద్దు