తెలంగాణలో 509 కరోనా కేసులు
- December 17, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గతంలో వేలల్లో నమోదయ్యే పాజిటివ్ కేసులు.. కరోనా కట్టడిలో భాగంగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 48,652 మందికి కరోనా పరీక్షలు నిర్వహంచగా, 509 పాజిటివ్ కేసుల నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ లో తెలిపింది. ఇక తాజాగా ముగ్గురు మృతి చెందగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,505కు చేరుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 2,79,644కు చేరుకుంది.
తాజాగా కరోనా నుంచి 517 మంది కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,70,063 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,172 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 5,063 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు 63,06,397 కరోనా పరీక్షలు నిర్వహించారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు