జనవరిలో `గాలి సంపత్` చివరి షెడ్యూల్.
- December 17, 2020
హైదరాబాద్:బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పిస్తూ, స్క్రీన్ ప్లే అందిస్తున్న చిత్రం 'గాలి సంపత్`. అనిల్ కో డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాతగా ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ను స్థాపించి షైన్ స్క్రీన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ హీరో శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరోహీరోయిన్లుగా, నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ గాలి సంపత్గా టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ మూవీ అనీష్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇటీవల అరుకులో ప్రారంభమైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా..
చిత్ర నిర్మాత ఎస్. క్రిష్ణ మాట్లాడుతూ - `` ఇటీవల ప్రారంభించిన అరకు షెడ్యూల్ పూర్తయ్యింది. మేం ప్లాన్ చేసిన విధంగా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ సపోర్ట్తో షూటింగ్ సజావుగా సాగింది. ఇప్పటివరకూ 80% టాకీపార్ట్ పూర్తయ్యింది. జనవరి 18 తర్వాత హైదరాబాద్లో జరిగే చివరి షెడ్యూల్తో షూటింగ్ పూర్తవుతుంది. తండ్రీ కొడుకుల మధ్య ముందెన్నడూ చూడని ఒక డిఫరెంట్ ఎమోషన్ తో అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్ మెంట్తో బ్యూటిఫుల్ జర్నీగా ఈ సినిమా తెరకెక్కుతోంది``అన్నారు.
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు, లవ్లీ సింగ్, తనికెళ్ల భరణి, సత్య, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్, మిర్చి కిరణ్, సురేంద్ర రెడ్డి, గగన్, మిమ్స్ మధు, అనీష్ కురువిల్లా, రజిత, కరాటే కళ్యాణి, సాయి శ్రీనివాస్, రూపలక్ష్మి తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి,
కథ: ఎస్. క్రిష్ణ,
స్క్రీన్ ప్లే: అనిల్ రావిపూడి,
రచనా సహకారం: ఆదినారాయణ,
సినిమాటోగ్రఫి: సాయి శ్రీ రామ్,
సంగీతం: అచ్చు రాజమణి,
ఆర్ట్: ఎ ఎస్ ప్రకాశ్,
ఎడిటర్: తమ్మిరాజు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగమోహన్ బాబు. ఎమ్,
మాటలు: మిర్చి కిరణ్,
లిరిక్స్: రామజోగయ్య శాస్ర్తి,
ఫైట్స్: నభ,
కొరియోగ్రఫి: శేఖర్, భాను,
మేకప్: రంజిత్,
కాస్టూమ్స్: వాసు,
చీఫ్ కో డైరెక్టర్: సత్యం బెల్లంకొండ.
నిర్మాణం: ఇమేజ్ స్పార్క్ ఎంటర్ టైన్మెంట్,షైన్ స్క్రీన్స్,
సమర్పణ: అనిల్ రావిపూడి,
నిర్మాత: ఎస్. క్రిష్ణ,
దర్శకత్వం: అనీష్
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







